స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తనపై లైంగీక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఆయన అసిస్టెంట్ యువతీ.. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నెటింట ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. మత్తు వదలరా 2 కి రవిశంకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ప్రెస్మీట్లో పాల్గొన్న ఈయన.. విలేకరులతో మాట్లాడుతూ వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా జానీ మాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా అని అడగగా.. అయనా సంపందించాడు.
రవి శంకర్ మాట్లాడుతూ.. సంచలనం కావడం కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని వార్తలునైనా సృష్టించడానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి వారే ఇలాంటి వార్తలు క్రియేట్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం.. వార్తలను బట్టి చూస్తే అది కేవలం జానీ మాస్టర్, అలాగే ఆ బాధిత యువతి వ్యక్తిగతమైన విషయం అని తెలుస్తోంది. ఇక పుష్ప 2 మొదలైనప్పుడే తనను అడిషనల్ కొరియోగ్రాఫర్గా తీసుకున్నాం. సినిమాలో అన్ని పాటలకు ఆమె పనిచేసింది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఈ పాటలు షూటింగ్ కు ప్లాన్ చేసాం. 5, 6 నెలల క్రితం మేము రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలలో కూడా తన పేరు ఉందంటూ వివరించాడు.
ఇక సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. జానీ మాస్టర్ తో వర్క్ చేయాలనుకున్నాం. ఇంతలో ఇలా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయాలు ఏమీ హీరోకు తెలియవని.. కేవలం విషెస్ చెబితే స్పందించడం తప్ప ఆయనకు వీటితో సంబంధం లేదని ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చాడు. ప్రధాన మీడియా లేవి ఇలాంటి వార్తలు రాయడం లేదని.. కొన్ని యూట్యూబ్ ఛానల్ సెన్సేషన్ కావడం కోసం ఇష్టం వచ్చినట్లుగా రాసేస్తున్నారు అంటూ రియాక్ట్ అయ్యాడు. ఇదంతా కొంతమంది చేస్తే డిస్టబెన్స్ మాత్రమే. వారి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అది వాళ్ళ పర్సనల్. దానిపై మనం రియాక్ట్ కాకూడదంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.