కొరటాలను మరోసారి టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌తో.. కొరటాల ఆచార్య సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మెగా అభిమానులంతా గతంలో కొరటాలను తెగ ట్రోల్స్ చేస్తూ.. విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇంకా మెగా అభిమానులు ఆచార్య దెబ్బ నుంచి బయటకు వచ్చినట్లు కనపడటం లేదు. కొరటాలశివపై వాళ్ళు ఇంకా కసితోనే ఉన్నట్లు వారి చర్యలు చెప్తున్నాయి. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా.. కొరటాల ఎదో క్యాజువల్‌గా ఒక స్టేట్మెంట్ ఇస్తే.. వాళ్ళు దానిని తమకు కావాల్సినట్లుగా మార్చేసుకున్నారు.

ఇక ఇటీవల విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ.. కలిసి ఎన్టీఆర్, కొరటాలను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలో సిద్దు జొన్నలగ‌డ్డ‌ అడిగిన ప్రశ్నల‌కు రియాక్ట అయ్యిన కొరటాల శివ.. నా పనికి నేను జవాబుదారి.. ఎప్పుడూ ఆ ఒక్క విషయంలో నాకు భయం ఉంటుంది. ఎవరి పని వాళ్లు చేస్తే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. పక్కోడి పనిలో వేలు పెట్టి కెలికి.. ఎదుటివారిని పూర్తి చేయనీయకుండా.. మనం కూడా పూర్తి చేయకుండా.. వదిలేస్తే అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది అంటూ కామెంట్స్ చేశారు.

తాజాగా కొరటాల శివ చేసిన ఈ స్టేట్మెంట్ తెగ వైరల్‌గా మారడంతో.. కొరటాల శివ ఈ స్టేట్మెంట్ చిరంజీవిని ఉద్దేశించే చేశారంటూ మళ్లీ ట్రోల్స్ మొదలుపెట్టారు. అతడు సందర్భానికి తగ్గట్టుగా ఆ స్టేట్మెంట్ ఇస్తే అందులోకి చిరంజీవి, రామ్ చరణ్‌ను తెచ్చి చిరు, చరణ్.. ఆచార్య సినిమా విషయంలో వెల్లు పెట్టి కెలకడం వల్లనే ఆచార్య డిజాస్టర్ గా నిలిచిందని.. రిజల్ట్ తేడా కొట్టిందని.. ఇన్ డైరెక్ట్ గా కొరటాల అలాంటి కామెంట్స్ చేస్తున్నారు..అంటూ తమ అభిప్రాయాన్ని పోస్ట్ ద్వారా షేర్ చేస్తూ.. తెగ వైరల్ చేస్తున్నారు.