టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి తన విధులను నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి వచ్చిన మూడు సినిమాలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా కూడా ఒకటి . ఇక తాజాగా ఈ మూ వీకు లైన్ క్లియర్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాల్లో శ్రీలీలా కూడా ఓ పాత్రలో నటిస్తుంది. కాగా రాజకీయాల కారణంగా సినిమా షూట్కు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పటివరకు తిరిగి సెట్స్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఓజీ షూటింగ్ఖు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడని సమాచారం. అయితే ప్రస్తుతం వార్తల ప్రకారం ఫస్ట్ సింగల్ కు మేకర్స్ డేట్ ను ఫిక్స్ చేశారట. సెప్టెంబర్ 2, 2024.. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పూర్తయి.. దసరా సెలబ్రేషన్స్ అయినా వెంటనే.. పవన్ సెట్లోకు ఎంట్రీ ఇవ్వనున్నాడని.. సినిమా షూట్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసుకునేలా పవన్ ప్లాన్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూట్ పూర్తిచేసి.. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట మేకర్స్. కాగా సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్, షామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. పిరియాడికల్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.