మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటీ రాష్ట్ర సీఎం పిసరయి విజచన్కి తాజాగా నివేదికను అందించింది. ఈ రిపోర్టులో ఎన్నో షాకింగ్ విషయాలు రివిల్ అయ్యాయి. కమిటీలో నటి శారదా, మాజీ ఐఏఎస్ అధికారి కేబీ వచ్చల కుమారి సభ్యులుగా హాజరయ్యారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో ఆఘాయిత్యాలు వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ తో పాటు లైంగిక దోపిడీకి సంబంధించిన ఎన్ని షాకింగ్ విషయాలు, ఎన్నో రిపోర్ట్లు వెల్లడించారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో స్త్రీ ద్వేషం ప్రబలిందని ఈ నివేదికలో వెల్లడించారు. ఎంతో మంది ప్రముఖ నటీమణులు కూడా లైంగిక వేధింపులకు గురయ్యారని.. బలవంతం చేయబడ్డారని కమిటీ వాంగ్మూలాన్ని అందించింది.
హేమా కమిటీ నివేదికల 55 నుంచి 56 పేజీల మలయాళ సినిమాల్లో లైంగిక నేరాల గురించి క్లియర్ కట్ గా రాసుకోవచ్చారు. మలయాళ సినిమాల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా పాల్పడుతున్నారని.. సినిమా చాన్స్ రావాలంటే ఖచ్చితంగా సర్దుకుపోవాల్సిన వాతావరణ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించడం లేదని.. కంప్లైంట్ వస్తే కుటుంబానికి బెదిరింపులు వెళ్తాయని.. భయపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అవసరాలకు అనుగుణంగా నటి లేకపోతే.. వారికి చిత్రసీమలో ఓ ముద్ర వేసేసి ఇండస్ట్రీ నుంచి తొలగించేస్తారని.. అలాగే ఈ చర్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారిని కూడా సినిమాల్లో మరోసారి కనపడకుండా చేసేస్తున్నారని చెప్పుకొచ్చారు.
మలయాళ సినిమాని ఓ మాఫియా గ్యాంగ్ కంట్రోల్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. సినిమాలో నటించేందుకు వచ్చి.. తమకు లొంగకపోతే చిత్రహింసలు గురికావాల్సిందేనంటూ వెల్లడించారు. అలాగే ఓ నటిని లైంగిక వేధింపులకు గురిచేసారని.. హగ్ చేసుకునే సన్నివేశాన్ని ఓ హీరో కావాలనే 17 టేక్స్ చేసి సద్వినియోగం చేసుకున్నాడని.. ఆ విషయంలో డైరెక్టర్ కూడా అతనిని ఏమీ అనలేదని.. అది తెలిసి మేము షాక్ అయ్యామంటూ హేమా కమిటీ నివేదికలో వెల్లడించింది. లైంగికంగా లొంగిపోయే వ్యక్తులకు మాత్రమే మంచి ఆహారం ఉంటుందని.. నటీమణులను నగ్నంగా నటించాలంటూ ఒత్తిడి చేస్తారని.. దర్శకులు, నిర్మాతలు అడుగుతున్నారని అలా చేయాలని.. కూడా ఇబ్బందులు పెడతారని షాకింగ్ విషయాలను రివిల్ చేశారు. ప్రస్తుతం ఈ రిపోర్ట్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది.