గోదావరి మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. సినీ పరిశ్రమల్లో అడుగుపెట్టి నటించిన అతి తక్కువ సినిమాలైనా.. స్టార్ బ్యూటీ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటారు. కానీ ఏవో కారణాలతో త్వరగానే ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలాంటి వారిలో నీతూ చంద్ర ఒకరు. ఈ పేరు చెప్పగానే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. గోదావరి మూవీలో సెకండ్ హీరోయిన్.. సుమంత్ మరదలు అంటే టక్కున‌ గుర్తుకు వచ్చేస్తుంది. ఇక నీతూ చంద్ర ఈ మూవీలో రాజీ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన ఈ సినిమా 2006 మే 19న రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ గాను మంచి హిట్ గా నిలిచింది.

ఇందులో హీరోగా సుమన్, హీరోయిన్గా కమల్ని ముఖర్జీ నటించి మెప్పించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికి గోదావరి సినిమా క్లాసికల్ సూపర్ హిట్ మూవీ. ఈ సినిమాలో సాంగ్స్ ఎంతోమంది వింటూనే ఉంటారు. ఇందులో సుమంత్ మరదలుగా పల్లెటూరి అమ్మాయిగా రాజీ పాత్రలో నీతు చంద్ర కనిపించింది. ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా.. అమాయకంగా, మరదలుగా ఆకట్టుకున్న రాజీ తెలుగు ఆడియన్స్ మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. 1984 జూన్ 20న బీహార్ పాట్నాలో జన్మించిన ఈ అమ్మ‌డు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే నటనపై ఇంట్రెస్ట్‌తో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తర్వాత 2003లో విష్ణువు అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత 2005లో ఘ‌రం మసాలా సినిమాలోను నటించింది.

ఈ సినిమాల్లో నటించిన అమ్మడుకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. 2006లో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెర‌కెక్కిన గోదావరి సినిమాతో మంచి పాపులారిటీ ద‌క్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా.. నీతుకి ఊహించిన రేంజ్ లో అవకాశాలు రాలేదు. అయితే ఈ అమ్మడు తర్వాత తమిళ్, హిందీ లో పలు సినిమాలో నటించి మెప్పించింది. 2021లో హాలీవుడ్‌లో నెవ‌ర్‌ బ్యాక్ డౌన్‌ సినిమాలోను చివరిసారిగా ప్రేక్షకులకు కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. మల్టీ టాలెంటెడ్. ఈమె కరాటే లోను బ్లాక్ బెల్ట్ చిన్నప్పటినుంచి కరాటే, టైక్వాండో లాంటి పోరాట విద్యలో ప్రావీణ్యత పొందింది. 2018లో ప్రో కబడ్డీ లీగ్ లో పాట్నా పైరేట్స్ కు నీతూ కమ్యూనిటీ అంబాసిడర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం పలు వ్యాపారాల్లో బిజీగా గడుతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నీతూ షేర్ చేసిన పోస్ట్, వీడియో వైరల్ గా మారుతున్నాయి.