మంచు మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మి కి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటిగా, నిర్మాతగా, యాంకర్ గా ఇలా అన్ని రంగాలోను రాణించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాతగాను మంచి సినిమాలను తెరకెక్కించింది. అయితే ఆ సినిమాలేవి కమర్సియల్ సక్సెస్ అందుకోలేదు. ఇక పలు టాక్ షోలకు కూడా హోస్ట్గా వ్యవహరించిన ఈ అమ్మడు.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి.. రెగ్యులర్గా తన ఫోటోలతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మి నెటిజన్లను సహాయము అడుగుతూ చేసిన ఓ పోస్ట్ నెటింట చర్చినియ అంశంగా మారింది. ప్రస్తుతం ఆ పోస్టు నెటింట తగ్గ ట్రెండిగా మారింది. ఇంతకి ఆమె చేసిన పోస్ట్ ఏంటి.. అసలు ఏం జరిగింది.. ఒకసారి చూద్దాం. తన కూతురి గురించి ఓ పోస్ట్ ని షేర్ చేసింది మంచి లక్ష్మి. కూతురి కోసం అమెరికా వెళ్లేందుకు అత్యవసర సహాయం కోరింది. నా అమెరికా వీసా ఒక నెల క్రితమే అప్రూవయింది. కానీ ఇప్పటివరకు నాకు అది దక్కలేదు. నా కూతురు స్కూల్ కి ఇచ్చిన సెలవులు పూర్తయ్యాయి. నేను జూన్ 12న అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కానీ నాకు ఇంకా వీసా ఇవ్వలేదు.
ఎంబసీ వెబ్సైట్ ప్రాబ్లం తో నేను వాళ్ళను కాంటాక్ట్ అవ్వలేకపోతున్నా. ఇప్పటికే వీసా అప్రూవల్ రెండు నెలలు దాటిపోయింది. దయచేసి ఇలాంటి సమస్యకు పరిష్కారం తెలిస్తే ఎవరైనా నాకు సహాయం చేయండి.. వెంటనే స్పందించండి అంటూ వేడుకుంది. మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెటింట వైరల్ గా మారింది. దీంతో పలువురు నెటిజన్స్ వాళ్లకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ను మంచు లక్ష్మితో షేర్ చేసుకుంటూ ఆమెకు సహాయం చేస్తున్నారు. ఎకనాలెడ్జ్మెంట్ తీసుకుని అంబసీకి వెళితే మీకు సహాయం దొరుకుతుందని.. వారు మీకు సమాచారం అందిస్తారని వివరిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎప్పటిలాగే సూటిపోటి మాటలతో, ఫన్నీ కామెంట్ చేస్తూ, ట్రోల్స్ చేస్తు ఆడుకుంటున్నారు. ఇక మంచు లక్ష్మి చేసిన ఈ పోస్ట్ ద్వారా తనకు సహాయం దొరుకుతుందో.. లేదో.. వేచి చూడాలి.