కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న అజిత్.. త్రిష హీరోయిన్ గా విడముయర్చి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది దశకు చేరడంతో తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి తీసుకువచ్చాడు అజిత్.
గుడ్ బాడ్ అగ్లీ టైటిల్ తో.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ హైదరబాద్లో గ్రాండ్ లెవెల్లో జరిగింది. అలాగే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు మేకర్స్.
ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ నటించబోతుందని సమాచారం. కాగా సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందా.. లేదా శ్రీ లీలా ప్లేస్ లోనే కీర్తి సురేష్ ని తీసుకుంటున్నారా అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే కీర్తి సురేష్ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ చేరినట్లే.