“అలా జరిగితే నాకు చాలా చాలా హ్యాపీ”.. అనుపమ పోస్ట్ వైరల్..!

అనుపమ పరమేశ్వరణ్.. ఈ మధ్యకాలంలో మారు మ్రోగిపోతున్న పేరు. ఏ విధంగా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారో ..ట్రోల్ చేస్తున్నారో.. ట్రెండ్ చేస్తున్నారో.. అభిమానులు మనం చూస్తూనే ఉన్నాం . కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరణ్ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత వరుస సినిమాలతో సందడి చేసింది . హీరోయిన్ గా నటించింది. ఎంత బోల్డ్ గా దర్శనమిచ్చిందో మనకు తెలిసిందే.

ఫ్యాన్స్ దెబ్బకు షాక్ అయిపోయారు . అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ చేతిలో ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. నాలుగు కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలే కావడం గమనార్హం . అనుపమ పరమేశ్వరణ్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది . “నేను ఆనందించే ఏకైక నాటకం నా కనురెప్పలలో మాత్రమే ఉంటుంది” అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫోటోస్ వైరల్ గా మారాయి .

దీంతో అనుపమ పరమేశ్వరన్ పేరు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలా పద్ధతిగా ఉండే అనుపమ పరమేశ్వరణ్.. ఎందుకు బోల్డ్ గా మారింది .. మళ్లీ ఎందుకు తాను పద్ధతి గల హీరోయిన్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి పోస్ట్లు పెడుతుంది అంటూ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ పేరు హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతుంది. మొత్తానికి ఏదో భారీ ప్లాన్ నే చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ అన్న విషయం అర్ధమైపోతుంది..!!