యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ కెరీర్లోను వీరిద్దరి కాంబోలో వచ్చిన టెంపర్ సినిమా ఎంత స్పెషలో చెప్పనవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అటు తారక్ తో పాటు.. ఇటు పూరి కెరీర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు కథను వక్కాంతం వంశీ అందించారు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ ఎన్టీఆర్కు అసలు చేయాలని లేదట. మొదట ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ కు తారక్ చెప్పారట. టెంపర్ ముందు వరకు తారక్ అన్ని సినిమాల్లో పాజిటివ్ రోల్స్ లో నటించి.. ఈ సినిమాలో ఒక్కసారిగా నెగిటివ్ షేడ్స్లో కనిపించాడు.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్, తనికెళ్ల భరణి ఆస్తికి సంబంధించి ఇబ్బంది పెట్టి.. అయన స్వస్థలం లాక్కునే సీన్ అందరికీ కోపాన్ని తెప్పిస్తుంది. అయితే ఆ సీన్ లో నటిస్తే ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో అనే భయంతో తారక్ ఆ సీన్ చేయడానికి ఇష్టపడలేదట. అయితే పూరి జగన్నాథ్ మాత్రం రాక్షసుడు.. గొప్పవాడిగా మారే కథంశాంతో ఈ సినిమా తెరకెక్కుతుందని.. ఆ సీన్ లో నటించక తప్పదు అంటూ కన్విన్స్ చేశాడట. టెంపర్ సినిమా రిలీజ్ తర్వాత.. ఎన్టీఆర్ ఊహించినట్టే ఫస్ట్ హాఫ్ విషయంలో ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ బగుండటం.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఫస్ట్ హాఫ్లోని సీన్లను.. సెకండ్ హాఫ్ లోని సీన్లకు లింక్ చేస్తూ పూరి జగన్నాథ్ సినిమాను తెరకెక్కించడం ఫ్యాన్స్ ను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. అప్పట్లో రూ.43 కోట్ల రేంజ్లో కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా.. ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపించింది. గతంలో బండ్ల గణేష్ తనకు మంచి లాభాలు అందించిన సినిమా టెంపర్ అంటూ ఎన్నో సందర్భాల్లో వివరించాడు. ఎన్టీఆర్ నటించిన మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో టెంపర్ కూడా ఒకటి. ఎప్పటికైనా ఈ సినిమా సీక్వెల్ కూడా రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా సీక్వెల్ వైపుగా తారక్ అడుగులు వేస్తారో లేదో వేచి చూడాలి.