పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పౌరాణిక పాత్రలు వేటిలో అయినా ఇట్టే సెట్ అయిపోతాడు ప్రభాస్. అయనకు కూడా అలాంటి పాత్రలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించాడు. బాహుబలి సినిమాలో రాజుగా మెప్పించాడు. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ పాత్ర మరి ఎవరిదో కాదు పరుశురాముడు.. క్షత్రియుల్లో అధర్మ ప్రవర్తన కలిగి ఉన్న దుర్మార్గులను సంహరించి భూభారాన్ని తగ్గించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ దాల్చిన అవతారమే ఈ పరుశురాముడు. సప్త చిరంజీవులు పరశురాముని అవతారం కూడా ఒకటి. తండ్రి జమదగ్ని నుంచి అఖండ పరుశువు అంటే గండ్ర గొడ్డలిని సాధించి ఎంతో ఖ్యాతిని పొందాడు. కనక ఆయనను పరుశురాముడు అని పిలుస్తూ ఉంటారు.
శ్రీమహావిష్ణువు సతావేశ్య అవతారమైన ఆయన 21సార్లు మొత్తం భూమండలాన్ని పర్యటించి వచ్చి.. ఆధర్మ క్షత్రియులను హతమార్చాడు. వారి రక్తంతో తన పూర్వీకులకు ఆత్మసంతృప్తిని కల్పించాడు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే కచ్చితంగా ఓ రేంజ్ లో సినిమా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకీ ప్రభాస్ నటించేది పరశురాముడి పాత్ర హీరోగా నడిచే సినిమాలో కాదట. ఇంతకీ ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో స్పెషల్ అపీరియన్స్ గా పరుశురాముడు కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కోసం ప్రభాస్ను సెలెక్ట్ చేశారట.
ఇక ఈ మూవీలో రాముడిగా రణ్బీర్, సీత గా సాయి పల్లవి, రావణుడి పాత్ర కోసం యష్, హనుమంతుడు పాత్రకు సన్నిడియోల్, విభిషనుడిగా విజయ్ సేతుపతి, సూర్పణకగా రకుల్ ప్రీత్ కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారీ తారాగణం అంతా నటిస్తున్న ఈ సినిమాలో పరశురాముడు పాత్రకు కూడా ఎంతో కీలకం గా ఉండనుందని తెలుస్తుంది. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.. మేకర్స్ కాస్టింగ్ పై అఫీషియల్ ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాలి. శ్రీరామనవమి సందర్భంగా డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2025 దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే లక్ష్యంగా మేకర్స్ పనులు చేస్తున్నారట. అయితే ఇతిహాస గాధని రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.