” టైగర్ నాగేశ్వరరావు ” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వెన్యూ ఎక్క‌డంటే..?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ లెవెల్‌లో నిర్మించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 15 సాయంత్రం 6 గంటలకు నుంచి హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిక లో ఎంతో వైభోగంగా నిర్వహించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఇక ఈ మూవీ అక్టోబర్ 20న భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ మాస్ యాక్షన్ మూవీ ఎంత మేరా అంచనాలు అందుకుంటుందో చూడాలి మరి.