తరచూ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలంతా కూడా వెకేషన్ అనగానే మాల్దీవులకు వెళ్లిపోవడం జరుగుతూ ఉంటోంది .అయితే హీరో హీరోయిన్లతో సహా క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం తమకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మాల్దీవులలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు హైదరాబాదు నుంచి గోవాకు ఎంత ఈజీగా వెళ్లేవారో ..ఇప్పుడు హైదరాబాద్ సహా ముంబై నుంచి కూడా మాల్దీవులకు అంతే ఈజీగా వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా అక్కడి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఉంటుంది మలయాళం ముద్దుగుమ్మ అమలాపాల్. బాలి దేశానికి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ అక్కడున్న ఫోటోలను వీడియోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. గతంలో తెలుగులో అనేక చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళం లోనే పలు సినిమాలలో నటిస్తోంది. ఇక ఈ మధ్యనే తన ప్రేమికుడు విజయన వివాహం చేసుకున్న ఈమె కొన్నాళ్లకే అతని నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఒక సింగర్ తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపించాయి కానీ అది నిజం కాదని తేలిపోయింది.
తాజాగా బాలి దేశం వెళ్లిన అమలాపాల్ అక్కడ వాటర్ లో ఎంజాయ్ చేస్తూ అక్కడ నుంచి ఫోటోలను వీడియోలను షేర్ చేసింది. ఒక ఫోటో షూట్ డంప్ ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అందులో ఒక రకమైన పువ్వుని ఆమె ముద్దాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక దీన్ని చూడగానే లవ్ ఫస్ట్ నైట్ కలిగిందని మళ్లీ మళ్లీ అక్కడికి రావాలనిపిస్తోంది అంటూ క్యాప్షన్ కూడా రాసుకుంది అమలాపాల్ ప్రస్తుతం ఈమె చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram