తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు ప్రేక్షకులు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే మొదటి షెడ్యూల్ కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా రెండవ షెడ్యూల్ చేయబోతున్న తరుణంలో ఈ చిత్రం పైన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ తరుణంలో ఈ చిత్రంలో జరుగుతున్న కొన్ని ప్రచార కార్యక్రమాలలో వాస్తవాలు కొన్ని అబద్ధాలు కొన్ని ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్న వాటి గురించి తెలుసుకుందాం.
వాస్తవానికి మహేష్ బాబు పాత్ర విషయంలో ఈ చిత్రంలో కొన్ని మార్పులు జరిగినట్లుగా త్రివిక్రమ్ కాంపౌండ్ నుంచి వార్తలు అధికారికంగా వెలుబడుతున్నాయి. ఇక అంతే కాకుండా ఈ చిత్రంలో మలయాళం లో స్టార్ నటుడుగా పేరుపొందిన… మోహన్ లాల్, పృధ్విరాజ్, మమ్ముట్టి ఎవరో ఒకరిని తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ మార్చిన తర్వాత ఈ పాత్ర యొక్క పరిధి కూడా చాలా తక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి పలు చర్చలు ముగిసినట్లుగా సమాచారం. ఈనెల చివరిలో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించబోతున్నట్లుగా త్రివిక్రమ్ సన్నితల నుంచి వార్తలు అందుతున్నాయి. అయితే త్రివిక్రమ్, మహేష్ బాబు తో రాజీపడి మరి సినిమా చేస్తున్నారని పుకార్లు చాలా వైరల్ గా మారుతున్నాయి.. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని సమాచారం .కేవలం మహేష్ బాబును ఒప్పించిన తర్వాతే త్రివిక్రమ్ ఈ సినిమాను ప్రారంభించారని సమాచారం. ఇక ఈ చిత్రంలోని కథను మార్పులు చేయడం వల్ల మహేష్ బాబు ప్రస్తుతం సంతృప్తితో ఉండి సినిమాను చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది అయితే సెకండ్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం.