సౌత్‌పై మ‌ళ్లిన క‌త్రినా మ‌న‌సు.. ఈ మార్పుకు కార‌ణం అదేనా?

కత్రినా కైఫ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో ఒకరైన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో మంచి స్టార్ డ‌మ్ దక్కించుకున్న కత్రినా తాజాగా `ఫోన్ బూత్` అనే సినిమాలో నటించింది. నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కత్రినా కైఫ్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

అయితే కత్రినా తెలుగులో కూడా స్టార్ హీరోలైనటువంటి బాలకృష్ణ, వెంకటేష్ సరసన హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే `బలరాం వర్సెస్ తారదాస్` అనే మలయాళ సినిమాల్లో కూడా ఈమె నటించింది. ఇక అసలు విషయం ఏమిటంటే బాలీవుడ్ లో సినిమాల కంటే సౌత్ సినిమాలనే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారట. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలంతా ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ పైన తమ హవా కొనసాగించాలని అనుకుంటున్నారట.

 

తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ చిరంజీవితో కలిసి `గాడ్ ఫాదర్` లో కనిపించి అలరించారు. అలాగే అజయ్ దేవగన్ కూడా `త్రిబుల్ ఆర్` సినిమాలో ఒక చిన్న పాత్ర చేశారు. ఇటీవల ఐశ్వరరాయ్ కూడా `పోన్నియన్ సెల్వన్` సినిమా తో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అయితే కత్రినా కైఫ్ ఈ సినిమా లాంటి అద్భుతమైన సినిమాను తాను ఎప్పుడు చూడలేదని.. ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. అయితే తాను కూడా సౌత్ లో నటించాలని.. అలాగే భాష అనేది పెద్ద సమస్య కాదని, మంచి కథ వస్తే సౌత్ దర్శకులతో కూడా సినిమా చేస్తానని ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేసింది. ఏదేమైనాప్పటికీ కత్రినా మనసు సౌత్ పై మళ్ళిందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కత్రినా కైఫ్ నటించిన తొలి సినిమా ఫోన్ బూత్. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్లో సిద్ధాంత్ చతుర్వేది డైరెక్షన్ లో తెరకెక్కించారు.