కృష్ణం రాజు గారు చేసిన ‘భక్త కన్నప్ప’ను మంచు హీరోలు రీమేక్ చేసారు… దాని సంగతేంటి?

భక్త కన్నప్ప అనగానే ముందుగా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన సినిమానే గుర్తుకు వస్తుంది. ఆయన కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఆ సినిమా. అప్పటివరకు వున్న ఇమేజ్ ని అమాంతం పెంచిన సినిమా ఇది. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. దివంగత దాసరి గారు ప్రతిసారీ కృష్ణంరాజును తలవగాస్తే ఈ సినిమాని గుర్తు చేసేవారు. ఆ తర్వాతా భక్త కన్నప్ప రీమేక్ గురించి చాలా సందర్భాల్లో చర్చ సాగింది. ఇప్పుడు రెబల్ స్టార్ అంతర్థానం వేళ మరోసారి అభిమానుల్లో పరిశ్రమ వర్గాల్లో నూ దీని గురించి చర్చ సాగుతోంది.

ఇకపోతే, ఈ క్లాసిక్ మూవీ భక్త కన్నప్ప ను భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లెవల్లో రీమేక్ చేస్తామని అప్పట్లో మంచు కాంపౌండ్ వర్గాలు ధృవీకరించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే నేటికీ ఆ విషయంపైన ఎలాంటి క్లారిటీ రాకపోవడం గమనార్హం. 450పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన మోహన్ బాబు కాంపౌండ్ నుంచి ఈ ప్రకటన రావడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే కృష్ణం రాజుతో ఆ కుటుంబ సాన్నిహిత్యం అంత గొప్పది. కొన్నాళ్ల క్రితం మంచు విష్ణు- మంచు మనోజ్ సహకారంతో భక్త కన్నప్ప రీమేక్ ముందుకు వెళుతుందని ప్రచారమైంది. కానీ అది ఇప్పటివరకూ జరగలేదు.

అమెరికాలో వియామార్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే కంపెనీని ప్రారంభించి అక్కడి రచయితలతో తెలుగు రచయితలను సమన్వయం చేసుకుని మంచి కథల్ని వండించే ప్రయత్నంలో మంచు కుటుంబం ఉందని కూడా కథనాలొచ్చాయి. భక్త కన్నప్ప పనుల్ని వారు చూసుకుంటారని అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనల్లో పరిణితి వచ్చిందని.. దీనికి అనుగుణంగా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని విష్ణు అప్పట్లోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది ఎంత వరకు వర్కవుటుతుందో తెలియదుగానీ ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నట్లు చెప్పారు మంచు హీరో.