ఆ వ్యక్తి నీహారికను కావాలనే ఇరికించారా..ఇదేం ట్వీస్ట్ రా బాబు..?

గత రెండు రోజులుగా సినీ ఇండస్ట్రీని ఊపేస్తుంది డ్రగ్స్ రైడ్ ఇష్యూ. బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​ రేవ్‌ పార్టీ టాలీవుడ్‌లో సంచలనం రేపుతుంది. ఆదివారం తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో విచ్చల విడిగా డ్రగ్స్ వాడుతున్నారంటూ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్లాన్ తో..రైడ్ చేసి..దాదాపు 150 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ వారికి బడా స్టార్స్ పిల్లలు కనిపించడం ఒక్క షాకింగ్ అయితే..వాళ్ల బ్యాగ్ లో డ్రగ్స్‌ బయటపడటం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి సుమారు 150 మందిని అదుపులోకి తీసుకోగా.. వీరిలో ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు..పలువురు బడా రాజకీయ నాయకుల పిల్లలు కూడా పట్టుబడం సంచలనంగా మారింది.

అయితే, తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..మెగాడాటర్ నీహారిక ఆ రోజు అసలు పబ్ కు వెళ్లాలి అనుకోలేదట. భర్త చైతన్య తో నే సరదాగా గడుపుదాం అని ప్లాన్ చేసుకున్నారట. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పార్టీ అంటూ చెప్పి రాను రాను అంటున్న బలవంతంగా ఒక్క గంట ఉండి వెళ్లిపో అంటూ సర్ధి చెప్పి అక్కడకు పిలిపించుకుని తీరా..ఫుల్ టైం అక్కడే ఉండేలా ప్లాన్ చేసి..పక్కగా ఇరికించింది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. కాగా, నీహారిక డ్రగ్స్ తీసుకుంది అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు అని ..పోలీసులు కూడా వాళ్ళ సైడ్ నుండి క్లీయర్ గా ఉన్నారని..అనవసరం గా మీడియా లో తప్పుడు వార్తలు ప్రచారం చేయద్దు అంటూ నీహారిక తండ్రి..నాగబాబు ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఏది ఏమైనా ఒక్క నీహారిక వల్ల మెగాఫ్యామిలీ అందరి పై నిందలు పడుతున్నాయి అంటూ మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.