అక్క క్లాస్ హీరో..చెల్లి మాస్ హీరో..ఏం పంపకం తల్లో మీది..?

హా..ప్రస్తుతం ఇదే మాట అందరి నోట వినిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అయిన అక్కా చెల్లెలు..మన టాలీవుడ్ హీరోల పై మనసుపారేసుకున్నారు. హాట్ బ్యూటి అక్క క్లాస్ హీరో సినిమాలో నటించి మెప్పిస్తే.. ఇప్పుడు క్యూట్ బేబీ అయిన చెల్లెలు మాస్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసి..అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. పూర్తి వివారాల్లోకి వెళ్ళితే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్‌ నేనొక్కడే’ గుర్తుంది కదా.. బాక్స్ ఆఫిస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..తరువాత తరువాత మంచి పాజీటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సూపర్ హిట్ మూవీతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌. నిజానికి తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా అయినా తెలుగు ప్రజలను తన నటనతో మెప్పించింది. కానీ,ఎందుకో తెలియదు అమ్మడుకు డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వలేదు. దీంతో టాలీవుడ్‌ కి బై బై చెప్పి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడే టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొంది వరస ఆఫర్స్‌ బిజీగా మారింది.

కాగా, ఇప్పుడు ఆమె చెల్లి నుపుర్‌ సనన్‌.. టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైంది. మాస్ మహారాజ రవి తేజ ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు . ఈ సినిమా పై జనాల్లో, రవితేజలో కూడా భారీ అంచానాలు పెట్టుకుని ఉన్నారు. కాగా, ఈ సినిమాలో నుపుర్‌ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిన్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమా పై మరింత హైప్ తీసుకొచ్చిన్నట్లైంది . అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ చేయనున్నట్టుగా ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. మరి చూడాలి..ఈ చెల్లెమ్మ అయినా టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటుందో లేదో..?