మెగా హీరోకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ..వామ్మో..యవ్వారం చెడిన్నట్లుందే..?

అందాల బొమ్మ..యాంకరమ్మ అనసూయ. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో..ఫిజిక్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతూ..తనలోని టాలెంట్ ని చూయిస్తూ..కష్టపడుతూ..మంచి మంచి ఆఫర్లని అందుకుంటుంది. జబర్ధస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అటు వెండి తెర పై ఇటు బుల్లితెర పై సమాంతరంగా అవకాశాలు అందుకుంటూ మధ్యలో షో లు కూడా హోస్ట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ప్రస్తుతం అనసూయ ఫోకస్ అంతా వెండితెర పై ఉన్నట్లు తెలుస్తుంది.

వరుస సినిమాలకు కమిట్ అవుతూ..బిజీ గా గడుపుతుంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్ధలం సినిమాతో తన పాపులారిటీ అమాంతం పెంచేసుకున్న ఈ బ్యూటీ..ఈ మధ్యనే మళ్లీ ఆయన డైరెక్షన్ లో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె రోల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..పుష్ప 2 లో మాత్రం అమ్మడు బాగా వాడేసుకోనున్నాడు సుకుమార్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, అనసూయ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో అనసూయ రోల్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటకొచ్చింది.

ఈ సినిమాలో అనసూయది ఓ పొగరుబోతూ విలన్ అని..కానీ పైకి చూసేందుకు మాత్రం సైలెంట్ గా అమాయకంగా కనిపించే పక్కింటి పాత్ర అని..కానీ సినిమాలో ఓ సంధర్భంలో అనసూయ అసలు క్యారెక్టర్ తెలుసుకున్న చరణ్..ఆమె గురించిన నిజం అందరికి చెప్పబోతుంటే..చిరంజీవిని చంపేస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేసి…చరణ్ కి గట్టి వార్నింగ్ ఇస్తుందని..ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి అలా మెగా హీరోకి అనసూయ వార్నింగ్ ఇచ్చిందనమాట. నిజానికి అనసూయ కి చరణ్ అంటే చాలా ఇష్టం ..రంగస్ధలం సినిమా షూటింగ్ టైంలో చాలా సార్లు చెప్పుకొచ్చింది. అప్పుడు వీళ్లు చాలా మంచిగా క్లోజ్ అయ్యారు. అలాంటి వీరిద్దరిని ఈ సినిమాలో విలన్ లు గా చూయించబోతున్నాడు కొరటాల మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..?