నోటికొచ్చినట్లు అంటే ఊరుకోను..ప్రియమణీ ఘాటు వ్యాఖ్యలు వాళ్లకేనా..?

ప్రియమణీ.. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన బ్యూటి. అప్పుడెప్పుడో ఎవరే అతగాడు సినిమాలో ఎంత అందంగా ఉందో ..నిన్న కాక మొన్న వచ్చిన భామకలాపం లోను అంతే హాట్ గా అందరిని ఆకట్టుకుంటుంది. మధ్యలో కొంచెం అటు ఇటు అయినా..పాప ఫుల్ పక్క ప్లానింగ్ తో దూసుకుపోతుంది. మొదట్లో తెలిసో తెలియకో అన్ని సినిమాలను ఓకే చేసిన ఈ బ్యూటీ..ప్రజెంట్ తెలివిగా ధింక్ చేస్తూ..మంచి మంచి స్టోరీలను పట్టేస్తుంది.

కాగా, ప్రజెంట్ ఢీ షో లో జడ్జీగా ఉంటున్న ఈమె వెండి తెర పై కూడా తన లక్ ను పరీక్షించుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కిర్రక్ ఆఫర్లు పట్టేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ ప్రియమణీ..కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మీమ్‌స్ ఎంత పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. ఏ ఇష్యూ జరిగినా నిమిషాలల్లో అవి ఫన్నీ గా మీమ్‌స్ గా చేస్తుంటారు.

అలా ప్రియమణి పై కూడా చాలా వచ్చాయి . అవి చూసి అమ్మడు బాగా నవ్వుకునేదట. కానీ రాను రాను మీమ్‌స్ హద్దులు దాటేస్తుండటంతో అమ్మడికి కోపం వచ్చి.. అలాంటి వారిని బ్లాక్ చేసేదట. ఆమె మాట్లాడుతూ.. సోషల్‌ మీడియానే జీవితం కాదు.. అది జస్ట్ లైఫ్‌లో ఒక భాగం మాత్రమే.. అంతే.. అభిమానులు నన్ను ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా మరేం పర్వాలేదు.. నా లానే నేను ఉంటా..ఒకరికోసం నేను మారాను అంటూ కూసింత ఘాటుగానే జవాబిచ్చింది. దీంతో ప్రియమణీ కి బాగా హర్ట్ అయ్యిన్నట్లు ఉంది అంటూ అభిమానులు అనుకుంటున్నారు.