RRR సినిమాకే హైలెట్ సీన్ అదే..గూస్‌బంప్స్ పక్కా..!!

కొద్ది గంటలు కేవలం కొద్ది గంటల సమయమే మిగిలింది ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కావడానికి . దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా “రణం రౌద్రం రుధిరం”. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు చరణ్-తారక్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దాదాపు నాలుగేళ్ళు ఎంతో మంది టెక్నిషియన్స్..కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా తెరకెక్కించిన RRR సినిమా అసలు రివ్యూ మరి కొద్ది సేపట్లోనే తెలిసిపోనుంది.

ఇక రాజమౌళి తన కెరీర్ లో ఎప్పుడు లేనంత ఎక్కువుగా ఈ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించారు. దీంతో అభిమానులో ఈ సినిమా పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కాగా, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ..డైనమిక్ డైరెక్టర్ సందీప్ వంగా తో ఓ స్పెషల్ ఇంటర్వ్యుల్లో పాల్గోన్నారు. ఈ నేపధ్యంలోనే సినిమాకి సంబంధించి..ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా జాగ్రత్తగా..ఎంతో కష్టపడి ఇష్టంగా తెరకెక్కించానని చెప్పిన ఆయన ..సినిమా మొత్తానికి ఓ సీన్ హైలెట్ గా నిలవనుందని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ని ఓ మూమెంట్ లో అరెస్ట్‌ చేస్తారని..ఆ సీన్ కి ముందు వచ్చే సీన్‌ సినిమాకే హైలెట్ గా ఉంటుందని. అసలు ఎందుకు తారక్ ని అలా దారుణంగా కొట్టాల్సి వచ్చింది.. ఎందుకు అరెస్ట్ చేస్తారు..ఆ తరువాత ఏమైంది..ఇలా ఆ సీన్ అదిరిపోయేలా ఉంటుందని సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాడు. కొమరంభీమ్‌ గా నటించిన తారక్ ను బ్రిటీష్‌ అధికారిగా ఉన్న అల్లూరి అరెస్ట్‌ చేసే సీన్ లో ఓ 1000 మంది దొమ్మి తరహాలో కొంటుకుంటూ ఉంటారని… వారిని చెదరగొట్టడానికి రామ్‌ చరణ్‌ లాఠీతో అందరిని కొడుతుంటాడని..ఆ సీన్ సినిమాకే హై లెట్ అవ్వనుందని చెప్పుకొచ్చారు. కాగా ఎన్టీఆర్‌ అరెస్ట్‌ సీనే… సినిమాకు హైలెట్‌ అని చెప్పడంతో నందమూరి అభిమానులు ఈ సినిమాను తెర పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు.