వావ్: అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ ఇక ఆగుతారా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ వాళ్లల్లో కొందరు మాత్రమే హిట్లు ఫ్లాప్ లు సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ..అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వాళల్లో మహేష్ బాబు కూడా ఒకరు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..ధమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన కళావతి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. యూట్యూబ్ లో దుమ్ము దులిపేసింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మహేష్ బాబు కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇప్పటి వరకు వెండితెర పై హీరో గా అలరించిన ఈయన ఇప్పుడు అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి తనలోని కొత్త టాలెంట్ ను కూడా చూయించబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా మహేష్ బాబు తన తదుపరి చిత్రాని త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసి..పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం మహేష్ ఓ పాట పాడబోతున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఓ సరదా సన్ని వేశం కోసం తన గొంతును కదపబోతున్నాడంటూ సిని వర్గాలల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది నిజంగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉన్నట్లు దానికోసం భీమ్‌లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ ని ఫైనల్ చేసిన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో ఆమె పాత్రే హైలెట్ కానుందట. మహేష్ కు మరదలిగా చేస్తున్న ఆమె చుట్టు నే కధ మొత్తం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.