వావ్: అప్పుడేమో ఎన్టీఆర్ భార్య..ఇప్పుడు చిరంజీవి భార్య..సేమ్ టూ సేమ్..!!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కే కాదు వాళ్ల కుటుంబ సభ్యులకి కూడా జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటాది. తమ అభిమానించే హీరో తో పాటు వాళ్ల భార్యను కూడా ఆరాధిస్తుంటారు అభిమానులు. ఇక అభిమానులకి హీరోలకి మధ్య సోషల్​ మీడియా ఓ మంచి ఫ్రెండ్ లా మారిపోయింది. ఒకప్పుడు అంటే తమ అభిమాన హీరో నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నాడు..ఎలాంటి బట్టలు వేసుకుంటాడు..ఎలాంటి ఫూడ్ తింటారో అనే విషయాలు తెలుసుకోవడం పెద్ద కష్టంగా ఉండేది. కానీ ఏ ముహూర్తాన సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ..అప్పటి నుండి చిన్న హీరోల దగ్గర నుండి బడా సెలబ్రిటీలు వరకు అందరికి సంబంధించి వార్తలు ఎప్పటికి అప్పుడు మీడియాలో వచ్చేస్తున్నాయి.

ఇక సోషల్ మీడియాలో అనేకమంది సినీ సెలబ్రిటీస్ యాక్టివ్​గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన మూవీ అప్​డేట్స్​, సరదా సన్నివేశాలు, మోస్ట్​ మెమొరబుల్​ థింగ్స్​ను అభిమానులతో పంచుకుంటారు. దీని ద్వారానే స్టార్స్ ఫ్యాన్స్​తో ఇంటరాక్ట్​ అయ్యేందుకు ఒక మంచి ప్లాట్​ఫామ్ అని చెప్పవచ్చు. కాగా నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న స్టార్ హీరోల భార్యలు ఇప్పుడు ​ సోషల్​ మీడియాలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.

ఇటీవల ప్రతీ ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరుస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ట్వీట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే..ఇక ఆ తరుబాత బాలీవుడ్​ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ​ ఇన్​స్టా గ్రామ్​ అకౌంట్​ ఓపెన్​ చేశారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మెగాస్టార్​ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల కూడా చేరిపోయారు. మెగాస్టార్ భార్య..స్టార్ హీరో తల్లి సోషల్​ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రామ్ చరణ్‏తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ నా సూపర్ స్టైలీష్ కొడుకుతో నా ఫస్ట్ పోస్ట్ అంటూ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్ల వైరల్ అవుతుంది.