కీచకుడు గా మారిన ప్రేమోన్మాది.. అమ్మాయి గొంతు కోసి మరి..!!

అబ్బాయిలు తమ ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారు ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టినాగులపల్లి లో అత్యంత దారుణం చోటుచేసుకుంది.. ప్రియుడు ప్రియురాలి బెడ్రూమ్ లోకి చొరబడి కత్తితో అమ్మాయి గొంతు కోశాడు.. ఇక యువతి అరవడంతో ఆమె తల్లిదండ్రులు బంధువులు నిందితున్ని పట్టుకొని చితకబాదడం జరిగింది..

పూర్తి వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల కు చెందిన బాయన ప్రేమ్ సింగ్ అనే 21 ఏళ్ల కుర్రాడు కేపీహెచ్బీలో ఉన్న ఎమ్మెన్నార్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.. ఇక మాదాపూర్ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడీల రుఖీ సింగ్ (21) బంధువు కావడంతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు.


కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం యువతిని కాంటినెంటల్ హాస్పిటల్‌లో, యువకుడిని కిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి మత్తులో ప్రేమ్ సింగ్ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.