పవన్‌కు పొత్తు సెట్ కాదా? వైసీపీ గేమ్.?

టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని చెప్పి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమకు ఇబ్బంది అనే సంగతి వైసీపీ గ్రహించింది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ది జరుగుతుందనేది వైసీపీ భావన. కానీ టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేసే […]

జగన్ క్లియర్ స్కెచ్..99.5 అంటూ ఎత్తు.!

నో డౌట్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో అదే తేల్చారు. ఇంకా ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని, ఈలోపు అందరూ కష్టపడి చేసి..పార్టీ గెలుపుకు కృషి చేయాలని మంత్రులకు సూచించారు. దీంతో జగన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో సంక్షేమంతోనే ప్రజల ఓట్లు దక్కించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదివరకు ఎవరు అమలు చేయని విధంగా తాను మాత్రమే పెద్ద ఎత్తున సంక్షేమ […]

మిషన్ రాయలసీమ..వైసీపీ టార్గెట్‌తో లోకేష్.!

గత వంద రోజుల పై నుంచి రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట లోకేష్ పాదయాత్రపై ప్రజలకు పెద్ద అంచనాలు లేవు. అలాగే అనుకున్న విధంగా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు. కానీ నిదానంగా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో […]

మైదుకూరులో సైకిల్ జోరు..కడపలో గెలుచుకునే ఫస్ట్ సీటు.?

జగన్ సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ నిదానంగా పికప్ అవుతుంది. ఇంతకాలం అక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు..కానీ ఇప్పటివరకు కాంగ్రెస్, వైసీపీలని గెలిపిస్తూ వస్తున్న కడప ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా గెలుపుకు దూరమైన టి‌డి‌పి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో జిల్లాలో లోకేశ్ పాదయాత్ర టి‌డి‌పికి ఊపు తెస్తుంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సక్సెస్ అయిన పాదయాత్ర..మైదుకూరులో ఊహించని స్థాయిలో విజయవంతమైంది. లోకేశ్ సభకు భారీ […]

ప్రొద్దుటూరులో లోకేష్ సంచలనం..టీడీపీకి అడ్వాంటేజ్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రతో వెళుతూ ప్రజలని కలుస్తున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు ప్రజల మద్ధతు బాగానే వస్తుంది. అలాగే లోకేష్ సభలకు జనం బాగానే వస్తున్నారు. దీంతో ప్రజల్లో లోకేష్ బలం పెరిగినట్లే కనిపిస్తుంది. ఇక లోకేష్ పాదయాత్ర వల్ల టి‌డి‌పికి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఆ పార్టీకి బలం పెరుగుతుంది. అయితే తాజాగా లోకేష్ పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అక్కడ లోకేష్ పాదయాత్రకు వైసీపీ ఇబ్బందులు పెట్టే […]

బాలినేనికి సొంత తలనొప్పి..వదలడం లేదట..ఒంగోలులో దెబ్బతీస్తారా?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సొంత తలనొప్పి తగ్గడం లేదు. సొంత వాళ్ళే ఆయనకు డ్యామేజ్ చేస్తున్నారట. కుట్రలు పన్నుతున్నారట. దీంతో బాలినేని..డైరక్ట్ గా జగన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. చాలా రోజుల నుంచి బాలినేని ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత వాళ్లతోనే ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. తనకు కావాలని డ్యామేజ్ చేస్తున్నారని, తనకు ప్రాధాన్యత దక్కకుండా చూడాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆ మధ్య ప్రాంతీయ సమన్వయకర్త […]

వైసీపీ వర్సెస్ జనసేన..పవన్ బరిలో దిగే సీటులో రచ్చ.!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ-జనసేన ఓ రేంజ్ లో పోరాటం చేస్తున్నాయి. ఇక రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతుండటంతో వైసీపీ సైతం..రెండు పార్టీలకు ఎక్కడకక్కడ చెక్ పెట్టే దిశగానే రాజకీయం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీల విషయంలో కూడా వైసీపీ తగ్గడం లేదు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్న విషయం తెలిసిందే. అందుకే పేదలని కాపాడుతూ […]

ముందస్తుపైనే చర్చ..జగన్ ఫిక్స్ అవుతున్నారా?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతూనే ఉంది. అధికార వైసీపీ తీరు చూస్తే ముందస్తుకు వెళ్ళే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే అధికార నేతలు మాత్రం ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకేంటి అని అంటున్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు పాలించమని సమయం ఇచ్చారని, ఐదేళ్ల పాటు ఉంటామని అంటున్నారు. కానీ ప్రతిపక్ష టి‌డి‌పి మాత్రం..ఖచ్చితంగా వైసీపీ ముందస్తుకే వెళుతుందని డౌట్ పడుతుంది. చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, కార్యకర్తలు […]

జ‌గ‌న్ రూట్లోనే చంద్ర‌బాబు కూడా… పేటెంట్ రైట్స్ ఎవ‌రికి…?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకూడా సంక్షేమం బాట‌ప‌ట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన రెండు రోజుల మహానాడులో చివ‌రిరోజు ఆయ‌న సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్క‌రించారు. దీంతో సంక్షేమం విష‌యంపై వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించ‌గా.. అస‌లు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల‌దేన‌ని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో సంక్షేమ ఎవ‌రి పేటెంట్‌? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ప్ర‌జ‌ల‌కు […]