ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం రాజకీయంగా చర్చకు వచ్చింది. ఇక్కడ అనూహ్యంగా రాజకీ య పరిణామాలు మారుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండడంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని మద్దతు పలకడం.. వంటివి రాత్రికి రాత్రి ఇక్కడి రాజ కీయాలను వేడెక్కించాయి. దీంతో అసలు ఇక్కడ ఏం జరుగుతోందనేది ఆసక్తిగామారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు వచ్చే ఎన్నికల్లో నూజివీడు టికెట్ ఇస్తారని ప్రచా […]