రాజకీయంగా నాయకులకు ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత.. కొంత ఇబ్బంది వస్తుంది. అదేంటంటే మాస్ మహారాజు మాదిరిగా ప్రజలను ఆకట్టుకోలేక పోవడం. అంతేకాదు.. ప్రజల మనసుల్లో చోటు సంపాయించుకో వడం. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబును పరిశీలిస్తే.. ఈ రెండు సమస్యలు ఆయన ప్రసంగాల్లో కనిపిస్తున్నాయి. ప్రజలు ఆయన సభలకు వస్తున్నారు. దీంతో ఆయన ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల్లో ఒకింత అగ్రసివ్ నెస్ కనిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]
Tag: Telugu desam party
తప్పులపై తప్పులు చేస్తోన్న చంద్రబాబు… మళ్లీ బిగ్ రాంగ్ స్టెప్…!
టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు చిత్రంగా కనిపిస్తున్నాయి. తనను నమ్మాలని ఆయన చెప్పడం లేదు కానీ.. పార్టీని బలోపేతం చేయాలని అంటున్నారు. అది కూడా తెలంగాణలోనే. అది కూడా.. మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన చెప్పడం లేదు. పార్టీ నుంచి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారని.. వారంతా తిరిగి వచ్చేయాలని ఆయన పిలుపుఇచ్చారు. ఇది మంచిదే అయినా.. ఎంత మంది తిరిగి వస్తారు? వచ్చినా..చంద్రబాబును ఎందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? అనేది కీలక ప్రశ్న. […]
తమ్ముళ్ల మధ్య గొడవ పెట్టిన చంద్రబాబు… తన్నుకుంటున్నారుగా…!
తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి! అని కన్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన డోన్ నియోజకవర్గానికి సంబం ధించి.. నాయకులు తన్నుకులాడుతున్నారు. డోన్ నియోజకవర్గంపై కేఈ కుటుంబం ఆశలు పెట్టుకుంది. కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని తపిస్తున్నారు. అయితే.. ఇంతలోనే చంద్రబాబు డోన్ నియోజకవర్గానికి ఇంచార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమిం చారు. కొన్ని రోజుల కిందట […]
టీడీపీని డిఫెన్స్లో పడేసిన కీలక ఎన్నిక..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఇది ప్రత్యక్షంగా కాదు.. పరోక్షంగానే! అయినా కూడా.. భారీ దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు.. తాజాగా విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ వెంకట్రామిరెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయనకు వైసీపీ సానుభూతిపరుడుగా పేరుంది. పైగా.. సీఎం జగన్ సొంత జిల్లాకుచెందిన వ్యక్తి. అంతేకాదు.. అవకాశం వచ్చిన ప్రతిసారీప్రభుత్వాన్ని ప్రశంసలతో నింపేసేవారు. సో.. ఈయన […]
టీడీపీతో ఏపీ కాంగ్రెస్ జత.. అదిరిపోయే స్కెచ్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడంటే తడబాటులో ఉంది. కానీ, వాస్తవానికి సంస్థాగత ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉంది. దీనికి కాస్త బూస్టప్ ఇస్తే.. పార్టీ పుంజుకోవడం.. మళ్లీ పునర్వైభవం ఖాయమ నేది పార్టీ నాయకుల అభిప్రాయం. దీనికి కావాల్సిందల్లా.. కొంత వ్యూహం.. మరికొంత చొరవ. ఇవి రెండూ లేకపోవడంతోనే పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ విఫలమైంది. బహుశ..ఈ దిశగా ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షులుగా వ్యవమరించిన రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్లు ప్రయత్నించలేదు. కేవలం క్షేత్రస్థాయిలో […]
జగన్ వాళ్లను రంగంలోకి దించడంతో బెంబేలెత్తుతోన్న చంద్రబాబు..?
రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి […]
బాబు ఢిల్లీలో ఇంత లైట్ అయిపోయాడా…!
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకు లు కలిసి విష్ చేశారు. అంతేకాదు, వారితో చంద్రబాబు కూడా ఖుషీ ఖుషీగా మాట్లాడారు. ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్తోను, తమిళనాడు సీఎం కేసీఆర్తోనూ.. చంద్రబాబు మాటా మాటా కలిపారు. అయితే.. ఎటొచ్చీ.. గతంలో తనతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగిన వారు మాత్రం చంద్రబాబును పక్కన పెట్టారు. దీంతో ఈ పరిణామం చర్చకు దారితీసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో […]
గల్లా పొలిటికల్ గేమ్ చంద్రబాబుపై నమ్మకం లేకేనా…!
టీడీపీ ఎంపీ, దూకుడు నాయకుడిగా పేరు తెచ్చుకున్న గల్లా జయదేవ్ తాజాగా తన కు చెందిన అమర రాజా బ్యాటరీ కంపెనీని తెలంగాణకు తరలించేశారని, దీనివల్ల ఏపీకి తీవ్ర నష్టం వచ్చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ అసమర్థత, వేధింపులు.. టార్గెట్ కారణంగానే గల్లా కంపెనీ వెళ్లిపోయిందని అనేక రూపాల్లో దీనిపై దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో 9500 కోట్ల మేరకు తెలంగాణకు పెట్టుబడులు సమకూరుతున్నాయని కూడా చెబుతున్నారు. ఇది నిజమే. వచ్చే 2030 […]
టీడీపీలో ఆ ఇద్దరు మారరు… చంద్రబాబే మారాలట…!
కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు […]