ఎన్టీఆర్ ని తొక్కేయాలని చూస్తున్నారా.. కారణం అదేనా..!

జూనియర్ ఎన్టీఆర్‌కు , టిడిపి పార్టీకి ఎంతో ఋణానుబంధం ఉంది. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ఆ పార్టీకి తన వంతు సాయం చేస్తూ ఆ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఎంతో మంది ఆయనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా ఎన్టీఆర్ ముందుకు వెళ్లి పోతున్నారు. ఇతర పార్టీల నుంచి మంచి ఆఫర్లు వచ్చిన ఎన్టీఆర్ తాతగారి మీద గౌరవంతో అయ‌న‌ స్థాపించిన పార్టీకే నా ప్రాధాన్యత అని ఎన్నో సందర్భాల్లో తేల్చి చెప్పాడు. నా అవసరం రాజకీయాలకు […]

బాబుకు సీటు ఫిక్స్ చేసిన పెద్దిరెడ్డి..కుప్పం వదిలేసినట్లే!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ బెదిరింపులతోనో..పథకాలు పోతాయని భయం తెప్పించడమో..లేక పలు రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించుకుని..కుప్పంలో కొంతమంది టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు. అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అయితే […]

బాపట్ల సీటు వర్మకు ఫిక్స్..1999 తర్వాత టీడీపీ గాలి.!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ అయ్యారు. ఇంచార్జ్ గా ఉన్న వేగేశన నరేంద్రవర్మకు సీటు ఫిక్స్ అయింది. తాజాగా చంద్రబాబు బాపట్ల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో అడుగడుగున బాబు పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక బాపట్లలోని అంబేడ్కర్ కూడలిలో జరిగిన భారీ రోడ్ షోలో నెక్స్ట్ ఎన్నికల్లో వర్మని భారీ మెజారిటీతో గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు. మొదట వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో […]

జవహర్-సుజాతకు బాబు షాక్..తేల్చేసినట్లేనా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా టీడీపీలో ఇంచార్జ్‌లు లేని నియోజకవర్గాలు ఉన్నాయి. కొందరు నేతలు ఇంచార్జ్ పదవుల కోసం పోటీ పడటం, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు పెరిగింది. దీంతో చంద్రబాబు ఎవరికి పదవి ఇవ్వకుండా అలా ఉంచేశారు. జిల్లాలో నిడదవోలు, కొవ్వూరు, చింతలపూడి, పోలవరం స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు. కానీ ఈ స్థానాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ఒకరికి సీటు ఇస్తే మరొకరికి తంటా అన్నట్లు పరిస్తితి ఉంది. […]

జ‌గ‌న్‌కు ఇది పెద్ద మైన‌స్సేనా… ఏం చెపుతారో ?

ఏపీకి.. ఇప్పుడు ఇదో పెద్ద మైన‌స్ అంటున్నారు మేధావులు. ఏపీని అన్నివిధాలా ముందుకు తీసుకువె ళ్తున్నాం.. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్న సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు గ‌ట్టి దెబ్బే త‌గిలింది. మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా, వినియోగంలో ఏపీ దేశంలోనేముందుంద‌ని కేంద్రం కుండ‌బ ద్ద‌లు కొట్టింది. అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోల మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స్వాదీనం చేసుకున్న‌ట్టు పేర్కొంది. అయితే.. దీనిని అధికార పార్టీ నాయ‌కులు లైట్ తీసుకునే అవ‌కాశం ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారు ఉన్న‌ప్పుడు […]

బాబు కొత్త నినాదం..’బై బై బాబు’లా క్లిక్ అవుతుందా!

రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి పార్టీలు రకరకాల వ్యూహాలతో వస్తాయి. సరికొత్త నినాదాలతో ప్రజల్లోకి వెళ్తారు. అవి క్లిక్ అయితే పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి నినాదాలతోనే  టీడీపీ ముందుకెళుతుంది. ఇప్పటికే బాదుడేబాదుడు కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్లారు. ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంతో ముందుకెళుతున్నారు. అంటే జగన్ వచ్చాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, అసలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారనే కాన్సెప్ట్‌తో పనిచేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు బాగానే […]

తిరువూరు టీడీపీలో కన్ఫ్యూజన్..మళ్ళీ మునిగేలా..!

టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గాల్లో తిరువూరు కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి అదృష్టం చాలా తక్కువ. పార్టీకి బలం ఉన్నా, బలమైన కార్యకర్తలు ఉన్నా, గెలిచే అవకాశాలు ఉన్నా సరే..చేజాతులా ఓడిపోవడం టీడీపీకి అలవాటైన ప్రక్రియ. 1999 ఎన్నికల తర్వాత నుంచి తిరువూరులో అదే జరుగుతుంది. ఇక్కడ చివరిగా 1999 ఎన్నికల్లోనే గెలిచింది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. అయితే ఇందులో పలుమార్లు గెలుపు దగ్గరకొచ్చే టీడీపీ ఓడిపోయింది. ఇలా […]

కోట్లపై కన్ను..వైసీపీకి ఛాన్స్ ఇస్తారా?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన నాయకుల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఒకరు. తన తండ్రి, మాజీ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి..కోట్ల ఫ్యామిలీకి జిల్లాలో మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అద్భుతమైన విజయాలు అందుకున్నారు. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. దీంతో కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి కోట్ల..2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. వాస్తవానికి అప్పుడే వైసీపీ సైతం కోట్ల ఫ్యామిలీ కోసం ట్రై […]

బాబు ఢిల్లీలో ఇంత లైట్ అయిపోయాడా…!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను ప‌లువురు నాయ‌కు లు క‌లిసి విష్ చేశారు. అంతేకాదు, వారితో చంద్ర‌బాబు కూడా ఖుషీ ఖుషీగా మాట్లాడారు. ఓడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తోను, త‌మిళ‌నాడు సీఎం కేసీఆర్‌తోనూ.. చంద్ర‌బాబు మాటా మాటా క‌లిపారు. అయితే.. ఎటొచ్చీ.. గ‌తంలో త‌న‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకు తిరిగిన వారు మాత్రం చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్టారు. దీంతో ఈ ప‌రిణామం చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి కేంద్రంలో […]