గుడివాడలో తమ్ముళ్ళ ఐక్యత..ఎన్నికల్లో వర్కౌట్ చేస్తారా?

మొత్తానికి గుడివాడలో తెలుగు తమ్ముళ్ళు కాస్త కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం సీటు తమదంటే తమదని నేతలు ఎవరికి వారు సెపరేట్ గా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. ఈ అంశం ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు ఇబ్బందిగా మారింది. పైగా రావి ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం నుంచి పెద్దలు గుడివాడ వెళ్ళి నేతలు కలిసి పనిచేయాలని సూచించారు. కానీ వారు చెప్పినా సరే పెద్దగా తమ్ముళ్ళు కలిసినట్లు కనిపించలేదు. పైయగా […]

బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవ‌రికి న‌ష్టం.. ?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో అధికారం లోకి వ‌చ్చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైనాట్ 175 నినాదంతో మ‌రోసారి విజ యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే.. ఏపీలో రెండు ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల రాజ‌కీయం ఊపందుకుంది. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబుతున్నాడు. ఈ క్ర‌మంలో టీడీపీ-జ‌నసేన క‌లిస్తే.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని […]

టీడీపీ-జనసేనతో 77 ఫిక్స్..అధికారానికి ఆ సీట్లే మెయిన్!

రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైందనే చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఫిక్స్ అయిందని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటితో క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీలు కలిస్తే అధికార వైసీపీకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి బాబు-పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. అయితే రెండు […]

మంగళగిరిపై లోకేష్ గ్రిప్..వైసీపీ కొత్త ప్లాన్!

గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి నారా లోకేష్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో లోకేష్ పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. అధికారంలో లేకపోయినా సరే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు అండగా ఉంటున్నారు. రోడ్లు వెయిస్తున్నారు..పేద ప్రజలకు కొన్ని పథకాలు కూడా ఇస్తున్నారు. ఇలా తన బలాన్ని పెంచుకుంటున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది..ఆ విషయం […]

బెజవాడ పంచాయితీ..పార్టీని అమ్ముకున్న వారు వద్దు!

గత కొన్ని రోజులుగా విజయవాడ(బెజవాడ) తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో సొంత పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తన తమ్ముడు కేశినేని శివనాథ్‌కు గాని, ఇంకో ముగ్గురు నేతలకు సీటు ఇస్తే తాను సహకరించనని , అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కేశినేని ప్రకటనలు చేస్తున్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా టార్గెట్ గా పరోక్షంగా […]

భూమా ఫ్యామిలీలో ట్విస్ట్..నంద్యాల ఆయనకేనా?

గత కొన్ని రోజుల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ సీట్ల విషయంలో టీడీపీలో క్లారిటీ లేని విషయం తెలిసిందే. ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ సీట్ల కోసం భూమా ఫ్యామిలీలో పోరు నడుస్తోంది. భూమా అఖిలప్రియ ఈ సారి రెండు సీట్లని తమకే దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. అంటే ఆళ్లగడ్డలో అఖిల..నంద్యాలలో అఖిల సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. కానీ నంద్యాలలో భూమా […]

తాడిప‌త్రిలో డిఫెన్స్‌లో టీడీపీ.. పెద్దారెడ్డిలో ఈ ధీమా ఎందుకు ?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి. దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కుప్పం ఎలా అయితే.. ప‌ట్టం క‌ట్టిందో.. ఇక్క‌డ జేసీ బ్ర‌ద‌ర్స్‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం 35 ఏళ్ల‌పాటు ప‌ట్టం క‌ట్టింది. వ‌రుస విజ‌యాల‌తో తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌నేది సంబంధం లేకుండా.. జేసీ బ్ర‌ద‌ర్స్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కిం చుకున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో వైసీపీ అభ్య‌ర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డివిజ‌యం సాధించారు. ఇంత‌వ‌ర‌కు బాగానేఉంది. అయితే.. వ‌చ్చే […]

కంచుకోట సీటు కోసం తమ్ముళ్ళ పోరు..దక్కేది ఎవరికి?

గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌ని తట్టుకుని టీడీపీ సత్తా చాటిన స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కూడా ఒకటి. ఈ స్థానం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ టీడీపీ ఓడిపోయింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా 2004 ఎన్నికల్లోనే. ఇంకా అన్నిసార్లు ఇక్కడ టీడీపే హవా నడిచింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం ఉండి నుంచి టీడీపీ తరుపున మంతెన రామరాజు గెలిచారు. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ స్ట్రాంగ్ […]

చంద్ర‌బాబు, టీడీపీపై ఎంపీ కేశినేని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఒక సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీని ప్ర‌క్షాళ‌న చేస్తేనే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప‌రిస్థితి కూడా లేద‌ని చెప్పుకొచ్చారు. అప్పుడే గెలుపు గురించి ఆలోచించే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి ఆయ‌న ఉద్దేశంలో ప్ర‌క్షాళ‌న అంటే.. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌క్షాళ‌న చేయ‌డ‌మా.. లేక విజ‌య‌వాడ వ‌ర‌కే ప‌రిమితం కావ‌డ‌మా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి ఎంపీ నాని […]