ఔను.. ఇదే విషయం ఆసక్తిగా మారింది. వైసీపీలో గుసగుస పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి.. మరోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయనున్నారని.. పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. దీనికి కారణం.. ఏంటి? ఇది నిజమేనా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు.. ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇటీవల మీడియా ముం దుకు వచ్చారు. తనకు జగన్కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. తన కుటుంబం వైఎస్ […]