ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు మోయాల్సిన నాయకుడు లోకేష్! టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన నేత! లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని టీడీపీ నేతలంతా కోరుకుంటున్నారు. అయితే అందరూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా.. బాబు మాత్రం కీలక పదవి ఇచ్చేందుకు వెనుకాడుతూనే ఉన్నారు. పార్టీపై పట్టు సాధించలేకపోవడం, చురుకుగా వ్యవహరించలేకపోవడం.. ఇంకా తండ్రిచాటు బిడ్డగానే ఉండటం.. వంటి కారణాలతో ఎప్పటికప్పుడు అడ్డంకులు వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేసేందుకు చంద్రబాబు […]
Tag: Politics
డీఎల్పై జగన్ మైండ్గేమ్ ?
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం సాధారణమే! అయితే ఇప్పుడు కడప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనే సూక్తిని నిజం చేసేలా కనిపిస్తోంది. వైఎస్ను, ఆయన తనయుడు జగన్ను శత్రువులా భావించే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఫొటో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో కనిపించడం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది. కడప గడపలో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తన […]
చంద్రబాబుకు యాంటీగా ఏపీలో బస్సు యాత్ర
పాలిటిక్స్లో ఒకరి ఐడియాను ఇంకొకరు కాపీ కొట్టినా తప్పుకాదు! ఇప్పుడు సీపీఐ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు గతంలో చేపట్టిన ఓ యాత్రనే మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు. చంద్రబాబు పాలనపై దండెత్తుతున్న సీపీఐ.. ప్రజల్లోకి మరింత వేగంగా త మ ప్రణాళికలను తీసుకువెళ్లేందుకు, బాబును ఏకేసేందుకు బస్సు యాత్రను మించింది మరోటి లేదని డిసైడ్ అయింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టబోయే బస్సు యాత్ర అన్ని విధాలా బాగుంటుందని సీపీఐ […]
జేసీ బ్రదర్స్కు మరో బ్రదర్స్ సవాల్
అనంతపురం పేరు చెప్పగానే ముందుగా వినిపించే పేర్లు జేసీ బ్రదర్స్! ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా జిల్లా అంతటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని తిరుగులేకుండా ఏలుతున్నారు. అధికార పార్టీ అండతో తమ ఆధిపత్యానికి ఎదురులేకుండా చూసుకుంటున్నారు. మరి అటువంటి వారిని సొంత జిల్లాలోనే ఢీకొట్టాలంటే ఎంత సాహసం చేయాలి!! అలాంటి వారిని ఢీకొట్టి సంచలనం సృష్టించారు జగదీశ్వర్ రెడ్డి సోదరులు! జేసీ సోదరులతో సై అంటే సై అంటున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి! అనంతపురం […]
అప్పుడే టీ టీడీపీలో టిక్కెట్ల ఫైటింగ్
క్యాడర్ బలంగా ఉన్నా నేతలు లేరు!! నాయకులున్నా వారి మధ్య సఖ్యత లేదు! నేనున్నా అంటూ నడిపించే నాయకుడు ఇప్పుడు టీటీడీపీకి కరువయ్యాడు. పేరున్న నేతలంగా టీఆర్ఎస్ కారులో ఎక్కేశారు. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవ్వడంతో.. తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డి వంటి నేతలకు అప్పగించారు. పార్టీని బలోపేతం చేయడం వదిలి.. నేతలంతా ఇప్పుడు ఫైటింగ్కు దిగారు. 2019లో ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి సీటు కావాలో.. అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. `తెలంగాణలో క్యాడర్ ఉంది.. దానిని సరైన […]
శశికళకు ముందుంది ముసళ్ల పండగ
తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఇక రేపో మాపో సీఎం పీఠంపై కూర్చోవాలని చూస్తున్న శశికళకు.. దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిస్తే `అధికార […]
ముద్రగడ దూకుడుకు బ్రేకులు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దూకుడుకి సీఎం చంద్రబాబు తనదైన స్టైల్లో బ్రేకులు వేస్తున్నారు. అడుగడుగునా ముద్రగడకు చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని వ్యూహాలను అనుసరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ సహా కొందరు సీనియర్లతో విమర్శలు గుప్పించిన చంద్రబాబు తాజా గా ఈ డ్యూటీని మంత్రులకే అప్పగించారని అనిపిస్తోంది. మూకుమ్మడిగా రాష్ట్ర మంత్రులు ముద్రగడపై విరుచుకుపడడం దీనికి బలం చేకూరుస్తోంది. వాస్తవానికి మంత్రుల స్థాయిలో ముద్రగడపై […]
పరిటాల అనుచరుడికి షాక్ తప్పదా..!
అనంతపురం టీడీపీలో ఆధిపత్య రాజకీయాలు తెరమీదకి వచ్చాయి. చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి పరిటాల సునీతల మధ్య ఆధిపత్య పోరు.. పీక్ స్టేజ్కి చేరే టైం వచ్చేసింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంపై టీడీపీ స్థానిక నేతల్లో అంతర్గత యుద్ధం రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఈ పోరులో కాల్వ వర్గం పైచేయి సాధిస్తుందా? పరిటాల పైచేయి సాధిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. 2014లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో […]
పవన్ దెబ్బకు కేంద్రం కూడా దిగివచ్చింది
పవర్స్టార్ పవన్కళ్యాణ్ పవర్ ఏంటో రాజకీయ పార్టీలకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. వెండితెర మీద పవన్ తిరుగులేని రారాజు అయినా పాలిటిక్స్లో మాత్రం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం సమావేశాలు పెట్టి జనాల్లోకి చొచ్చుకుపోతోన్న పవన్ తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆ జిల్లాలో పర్యటించి వారితో సమావేశమయ్యాడు. ఈ క్రమంలోనే పవన్ బాధితులకు ఏం చేస్తుందో చెప్పాలంటూ 48 గంటల పాటు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే […]