ఏపీలో అధికార టీడీపీకి నాయకుల మధ్య గొడవలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందన్నమాటే గాని చంద్రబాబుకు నాయకుల మధ్య గొడవలు సర్దుబాటుతోనే సగం కాలం గడిచిపోతోంది. టీడీపీ వర్సెస్ టీడీపీ నాయకులతో పాటు టీడీపీ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న పైడికొండల మాణిక్యాలరావుతో పాటు జిల్లా పరిషత్ […]
Tag: Politics
టీడీపీ 3 – వైసీపీ 0…. ఓటమి జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బే
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ తన దూకుడు చూపించింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన కౌంటింగ్లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్కుమార్రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి […]
నంద్యాలలో చంద్రబాబు మైండ్ బ్లాక్ చేసిన జగన్
ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో అక్కడ ఐదారు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావన అప్పుడే ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు వస్తోంది. దీనిపై విపక్ష వైసీపీ అధినేత జగన్ ముందుగానే డెసిషన్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు తమదే అని…అక్కడ నుంచి వైసీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించడంతో నంద్యాలలో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే చంద్రబాబు ఇక్కడి నుంచి […]
భూమా వర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో.. ఆయన వర్గం దిక్కలేనిది అయిపోయింది. ఇప్పటివరకూ నంధ్యాలలో పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తీవ్రంగా మధనపడింది పార్టీ అధిష్ఠానం! ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ బలంగా ఉన్న భూమా వర్గాన్ని బలహీనం చేసేందుకు వెనుక నుంచి శర వేగంగా పావులు కదుపుతోంది. నంద్యాల రాజకీయాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసక్తికరంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఉప […]
నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖరారు..!
ఏపీలో మరో ఉప ఎన్నికకు రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. 2014లో సాధారణ ఎన్నికల తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలవగా, కృష్ణా జిల్లా నందిగామలో మృతిచెందిన తంగిరాల ప్రభాకర్రావు కుమార్తె సౌమ్య విజయం సాధించారు. ఇక తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణ మృతి చెందగా అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య సుగుణమ్మ లక్ష […]
ఏపీలో ఆ 3 ఎమ్మెల్సీలు టీడీపీకా …వైసీపీకా..!
ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక వైసీపీకి మంచి బలం ఉన్న జగన్ సొంత జిల్లా కడపతో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కడప జిల్లాలో జగన్ తన సొంత బాబాయ్ […]
టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్..!
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు ఇటీవలే కాస్త బ్రేక్ పడింది. రెండు విడతలుగా జరిగిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు 21 మంది విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆపరేషన్ ఆకర్ష్ రెండో పేజ్ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు తెలుస్తోంది. మూడో విడత స్టార్టింగ్లోనే విపక్ష వైసీపీకి చెందిన ఇద్దరు […]
ఏపీ బీజేపీ నేతల దూకుడుకు బాబు కళ్లెం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత.. ఏపీ రాజకీయ చిత్రంలో అనేక మార్పులు జరిగే వాతావరణం కనిపిస్తోంది. ఎవరు ఎవరికి మిత్రులు అవుతారో.. మరెవరు శత్రువులవుతారో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విషయంలో టీడీపీ నాయకులు, టీడీపీతో వ్యవహరించే విషయంలో బీజేపీ నాయకుల్లోనూ కొంత మార్పు వచ్చినట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్తరించాలని బీజేపీ నాయకులు తహతహలాడుతున్నారు. విస్తరణకు ఇదే సరైన సమయమని పార్టీ పెద్దలకు చెబుతున్నారు. ఇదే […]
తెలంగాణలో పవన్ బలం ఎంత..?
2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి! ప్రజాసమస్యలపై పోరాటం, బహిరంగ సమావేశాలు వంటివి నిర్వహించి.. ఏపీ ప్రజల్లోకి జనసేనను తీసుకెళ్లాడు. మరి తెలంగాణలో ఇప్పటివరకూ ఏ సమస్యపైనా స్పందించలేదు! తెలంగాణ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. అసలు జనసేన ఉనకి తెలంగాణలో అసలు లేనే లేదు. మరి ఇలాంటి సమయంలో.. ఏధైర్యంతో పవన్ తెలంగాణలో పోటీకి దిగుతానని ప్రకటించాడు? ఆయన బలమేంటి? […]