వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై గట్టి పట్టుదలతోనే ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ మూడు సాధిస్తామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో అసలు పాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని తలపోస్తున్న విశాఖ ప్రజల మనోగతం ఏంటి? ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిపై ఆన్లైన్ మీడియా సంస్థలు వెంటనే రంగంలోకి దిగిపోయా యి. ప్రజల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]