తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ సహా సీఎం కేసీఆర్పై కమల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా పర్యటన వీరిలో కొత్త రక్తం నింపిందా? ఇక, భవిష్యత్తులో తెలంగాణలో కమలం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్పటికప్పుడున్న పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట వరంగల్లో భారీ ఎత్తున నిర్వహించిన బీజేపీ సభలో కమల దళాధిపతి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్లపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు. […]
Tag: bjp
ప్యాకేజీతో రాజకీయ సమాధి.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రచారాన్ని చేస్తూ, ప్యాకేజీ కాకుండా ప్రత్యేక సహాయంతో సరిపెట్టాలనుకున్న బిజెపికి, దాన్ని స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీకీ ఆంధ్రప్రదేశ్లో నూకలు చెల్లే రోజులు ముందు ముందు ఉన్నాయి. ప్యాకేజీ లేదా సాయం పేరుతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాయని ప్రజలు పరిశీలిస్తున్నారు. అయితే అధికార పార్టీ, ప్రజల ఆలోచనల్ని బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతోంది. ప్యాకేజీ పేరు చెప్పకపోయినా, సాయం పేరుతో విదుల్చుతామని కేంద్రం చెప్పినా స్వాగతించక తప్పని […]
పవన్తో బీజేపీ రాజీ యత్నాలు
హోదా ప్రకటించనందుకు ఏపీ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో దూరమవుతున్న మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడింది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తీవ్ర స్వరంతో బీజేపీపై విరుచుకుపడుతున్నాడు. దశల వారీ పోరాటానికి కార్యాచరణ కూడా ప్రకటించాడు. ఒకవేళ పోరాటానికి దిగితే భవిష్యత్తులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే!! అందుకే పవన్ రంగంలోకి దిగకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. జనసేనానితో రాయబారానికి దిగారు. `కాంగ్రెస్ వెన్నుపోటు […]
వెంకయ్యా ఈ కుప్పి గంతులేందయ్యా..
`లెఫ్ట్ ఎప్పుడూ రైట్ కాదు` అని వామపక్షాలపై విమర్శలు గుప్పించాలన్నా ఆయన తర్వాతే!! `ఆకాశంలో స్కామ్, నీటిలో స్కామ్, గాలిలో స్కామ్ ఇలా వారి హయాంలో అన్నింటిలోనూ స్కామ్లే` అని కాంగ్రెస్ను ఏకిపారేయాలన్నా ఆయన తర్వాతే!! ప్రాసలు, పంచ్లు.. మాటల తూటాలతో దాడి చేస్తారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో పోరాడిన ఆయనే ప్యాకేజీతో ఏపీకి లాభమని, హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని ప్లేట్ ఫిరాయించారు! విశాఖకు రైల్వే జోన్ వచ్చేలా కృషిచేస్తానని […]
మోడీ పొగిడారు, అమిత్ షా విమర్శించారు.
రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్ఎస్ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కెసియార్ని విమర్శించారు. కెసియార్ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]
ఎడ్యుకేట్ చేస్తున్న వెంకయ్య.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]
కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ
దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని […]
పవన్కి బీజేపీ రంగు తెలిసొస్తోంది.
పవన్కళ్యాణ్కి బిజెపి అసలు రంగు కనిపిస్తోంది. ఆ రంగుల్ని స్వయానా బీజేపీ నాయకులే చూపిస్తున్నారు. తిరుపతి బహిరంగ సభలో పవన్కళ్యాణ్ తమను విమర్శించినా, సరిపెట్టుకున్న బిజెపి నేతలు, ఈసారి కాకినాడలో చేసిన విమర్శల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మమ్మల్నే విమర్శిస్తావా? నీ రాజకీయ అనుభవం ఏంటి? అని వారు ప్రశ్నిస్తోంటే, పవన్కళ్యాణ్తోపాటు ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. బిజెపి నాయకుడు ఆంజనేయరెడ్డి అయితే ఎప్పుడో పవన్కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు స్థాపించిన సిఎంపిఎఫ్ (కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్) ఏమయ్యింది? […]
చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?
ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ […]