టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్‌..!

ఏపీలో అధికార టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇటీవ‌లే కాస్త బ్రేక్ ప‌డింది. రెండు విడ‌త‌లుగా జ‌రిగిన ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు 21 మంది విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్సీలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండో పేజ్ త‌ర్వాత కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. మూడో విడ‌త స్టార్టింగ్‌లోనే విప‌క్ష వైసీపీకి చెందిన ఇద్ద‌రు […]

ఏపీ బీజేపీ నేత‌ల దూకుడుకు బాబు క‌ళ్లెం

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. ఏపీ రాజ‌కీయ చిత్రంలో అనేక మార్పులు జ‌రిగే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎవ‌రు ఎవ‌రికి మిత్రులు అవుతారో.. మరెవ‌రు శ‌త్రువుల‌వుతారో కొద్ది రోజుల్లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విష‌యంలో టీడీపీ నాయ‌కులు, టీడీపీతో వ్య‌వ‌హ‌రించే విష‌యంలో బీజేపీ నాయ‌కుల్లోనూ కొంత మార్పు వ‌చ్చిన‌ట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్త‌రించాల‌ని బీజేపీ నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. విస్త‌ర‌ణ‌కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని పార్టీ పెద్ద‌ల‌కు చెబుతున్నారు. ఇదే […]

రోజాకు ఏమైనా ప్రత్యేక రూల్స్.. చట్టాలు ఉన్నాయా?

కొత్త అసెంబ్లీలోనూ అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత‌, బోండా ఉమామ‌హేశ్వ‌రావు.. మ‌ధ్య గ‌త అసెంబ్లీ సమావేశాల్లో జ‌రిగిన గొడ‌వ‌పై విచార‌ణ కొలిక్కి వ‌చ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించ‌డం, త‌ర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఇవ‌న్నీ పెద్ద దుమార‌మే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అన‌డంపై బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు […]

ఏపీ మంత్రి వ‌ర్గంలో `ఫ్యామిలీ` రాజ‌కీయాలు

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ముందు.. మంత్రుల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి! అస‌లే మంత్రి ప‌దవి ఉంటుందో ఊడుతుందో తెలియ‌క ఒక‌ప‌క్క తీవ్రంగా ఆందోళ‌న చెందుతుంటే.. ఇప్పుడు వారిపై ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు నివేదిక రూపొందించి.. సీఎం చంద్ర‌బాబుకు అందించాయి. దీంతో అందులో ఏముందో తెలియక మంత్రులు ఒకటే టెన్ష‌న్ ప‌డుతున్నారు. మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నా.. వెన‌కాల ఉండి చ‌క్రం తిప్పేదంతా వార‌సులేన‌నే విష‌యం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వ‌చ్చింద‌ట‌. వార‌సులే చ‌క్రం తిప్పుతున్నార‌ని, మంత్రులంతా […]

క‌ర్నూలులో టీడీపీకి ఊహించ‌ని షాక్‌

క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయాలు ర‌స‌వత్త‌రంగా మారాయి! ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ అధికార టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌బోతోంది. అలాగే ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి చేర‌బోయే నాయ‌కుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి.. ఇక రేపో మాపో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నారు. ప్ర‌భుత్వంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్న ఆయ‌న.. ఈ మేర‌కు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌తో చ‌ర్చించార‌ని స‌మాచారం. ఆయ‌న‌కు ఎంపీ టికెట్ […]

విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా

నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]

ప‌య్యావుల కేబినెట్ ఎంట్రీకి అడ్డు పుల్లెవ‌రు..!

ఏపీలో కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌కాక్ష‌ళ‌న‌లో ఆశావాహుల లెక్క‌లు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, సీనియ‌ర్లు, జంపింగ్ జ‌పాంగ్‌లు, ఎమ్మెల్సీలు ఇలా ఎవ‌రికి వారు త‌మ‌కు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌ని ఆశ‌ల్లో మునిగి తేలుతున్నారు. ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌కు ఫ‌స్ట్ బెర్త్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఇటీవ‌ల గుండెపోటుతో మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే […]

భూమా మృతికి సంతాప‌మా? ఎన్నిక‌ల ప్ర‌చారమా?

కాదేదీ క‌వితక‌నర్హం అన్నాడో మ‌హాక‌వి!! ఇప్పుడు కాదేదీ రాజ‌కీయాల‌క‌న‌ర్హం అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు! ఏ అంశాన్న‌యినా రాజ‌కీయాన్ని చేసి.. దానిని త‌మ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌డం ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్నతో పెట్టిన విద్య‌! క‌రెక్టుగా ఇప్పుడు భూమా నాగిరెడ్డి మ‌ర‌ణాన్ని కూడా ఎవ‌రికి వారు.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. చివ‌రికి ఆయ‌న‌కు సంతాప స‌భ కూడా రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం!! ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి […]

కేంద్రం నియోజ‌క‌వ‌ర్గాల‌ పెంపు…బాబుకి కొత్త జిల్లాల డిమాండ్

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం తెర‌పైకి వ‌చ్చింది. విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ప్ర‌తిపాద‌న అంశాన్ని కేంద్రం ప‌క్క‌న పెట్టింది. అయితే కొన్ని రోజులుగా ఈ అంశంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికే నియోజ‌క‌వ‌ర్గాలను పెంచాల‌ని కేంద్రం నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకో ఆసక్తిక‌ర అంశం ఏంటంటే.. నియోజ‌క‌వ‌ర్గాలే గాక‌.. ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఉన్న 13 […]