ఏపీ సర్కారుకు మరో సలహాదారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం […]

ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!

ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]

శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]

పట్టుకోసమే పెద్దారెడ్డి పోరాటం.. పట్టువదలని విక్రమార్కుడిలా జేసీపీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రసకందాయంలో పడింది. తాడిప్రతి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా మున్సిపల్ చైర్మెన్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అసలు విషయమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇబ్బంది కరమే. అందుకే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తూ ఉంటాడు. అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. […]

ఏపీ సర్కార్ కి అప్పులిచ్చి లబోదిబోమంటున్న బ్యాంకులు .. మొత్తం ఎంత అంటే ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతూ .. ప్రజలకు సేవలందిస్తోంది. క్రింద ప్రభుత్వాలు వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి వస్తోంది. అందుకోసం ఏపీ ప్రభుత్వం మద్యం వంటి వాటిపై పన్ను విధిస్తూ వచ్చింది. ఇక అంతే కాకుండా కొన్ని బ్యాంకులతో కూడా రుణాలు ఇప్పించుకుని క్యాష్ చేసుకుంది ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు .. రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తెలుపుతోంది. అలాగే పన్నులు ఎక్కువగా విధించడం వల్ల, ప్రజలపై చాలా భారం […]

కెసిఆర్,జగన్ లకు కేంద్రం ఝలక్ ..!

మంగళవారం (ఈరోజు) పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు నిరాశ ఎదురైనట్లయింది. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 చేయాలని, ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సమాధానమేంటని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో 2026లో జరిగే జనాభా […]

అయ్యో..అయ్యొయ్యో.. ఇంతటి అవమానమా..

తాడిపత్రి.. ఎప్పుడూ మీడియాలో నానే పేరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సోదరులు గతంలో ఓ వెలుగు వెలిగారు.  జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు హవా నడిచింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి వారిదే పైచేయి అయింది. ఇపుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం […]

లక్ష్మీపార్వతి నోట ధర్మాన మాట..ఆ విషయం తెలిసే ఉంటుందేమో..?

ఏపీ తెలుగు- సంస్కృత అకాడెమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి దాదాపుగా రాజకీయాలు మాట్లాడరు. సభలు, సమావేశాల్లో కూడా ఆమె విద్యా విషయాలపైనే ఎక్కువ మాట్లాడతారు. అయితే ఇటీవల ఆమె చేసిన కామెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గం ఖాయమని చెప్పింది. ఇదే వేదికపై ధర్మాన కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్ చేశారు.  రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని […]

ఏపీలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూ .. నిబందనలు ఇవే..!

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ను ఎత్తేశారు. దాంతో ప్రజలు విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 నుండి 30 వేల వరకు కేసు నమోదవ్వ‌గా … ప్ర‌స్తుతం 40 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా ఆసుపత్రుల్లో క‌రోనా పేషంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో థర్డ్ వేవ్ సంకేతాలే చెబుతున్నారు నిపుణులు. దాంతో ఏపీ సర్కార్ ముందు జాగ్ర‌త్త‌గా […]