వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనని జగన్ ఇప్పటికే చెప్పేసిన విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అటు టిడిపి, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరందరికి మళ్ళీ సీట్లు ఇవ్వడం అనేది కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం. దీంతో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఎవరికైతే […]
Category: Politics
ఏజెన్సీల్లో వైసీపీకి సెగలు..ఆ దెబ్బ గట్టిగా.!
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి గట్టి పట్టున్న విషయం తెలిసిందే. కీలకమైన ఎస్టీ స్థానాలని వైసీపీనే గెలుచుకుంటూ వస్తుంది. రాష్ట్రంలో 7 ఎస్టీ స్థానాలు ఉంటే..వాటినే వైసీపీనే గెలుచుకుంది. పోలవరం, రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వడ్ గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీకి ఎంత పట్టు ఉందో చెప్పవచ్చు. అలాంటి పట్టున్న చోట్ల ఇప్పుడు వైసీపీ పట్టు కోల్పోయే పరిస్తితికి వచ్చింది. […]
ఏపీలో కేసీఆర్ భారీ సభ..స్టీల్ ప్లాంట్తో ఎంట్రీ..!
ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరించే పనిలో ఉన్న ఆయన..ఏపీలో కూడా పార్టీని మొదలుపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ని నియమించారు. అయితే ఇప్పటివరకు ఏపీలో బిఆర్ఎస్ పెద్ద కార్యక్రమాలు చేయలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో రాజకీయం తాజాగా మొదలుపెట్టింది. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై […]
ఆ ఎమ్మెల్యే వద్దంటున్న వైసీపీ నేతలు..ఆ స్థానంలో ఓటమి దిశగా!
అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. ఓ వైపు అధిష్టానంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే…ఎమ్మెల్యేలపై కింది స్థాయి నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు. ఇలా వైసీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉమ్మడి విశాఖలో పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే ఉమ్మడి విజయనగరంలోని శృంగవరపుకోట స్థానంలో కూడా […]
కర్నూలు సిటీలో సీటు ఇష్యూ..వైసీపీలో డౌట్..టీడీపీలో క్లారిటీ.!
రాష్ట్రంలో వైసీపీలో ఆధిపత్య పోరు చాలాచోట్ల నడుస్తున్న విషయం తెలిసిందే. పలు స్థానాల్లో తీవ్ర స్థాయిలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పంచాయితీ ఉంది. అందులో కీలకంగా కర్నూలు సిటీలో రచ్చ ఎక్కువ ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అది కూడా స్వల్ప మెజారిటీలతోనే..ఇక అలా గెలిచిన సీట్లలో ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పోరు మెజారిటీని మరింత […]
నూజివీడులో తమ్ముళ్ళ పంచాయితీ..బాబు వచ్చాక తేల్చాల్సిందే.!
ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రచ్చ నడుస్తూనే ఉంది. నేతల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో అధినేత చంద్రబాబు నూజివీడులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కూడా అక్కడ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కొందరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న బాబు పర్యటనని దృష్టిలో పెట్టుకుని ముద్దరబోయిన, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఏర్పాట్లు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ […]
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఇంకా లైన్లోనే..!
ఏపీలో మైండ్ గేమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రివర్స్లో టిడిపి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని ఇటు తిప్పుకుని క్రాస్ ఓటు వేయించుకుని గెలిచిన టీడీపీ..అక్కడ నుంచి వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దాదాపు 16 […]
విశాఖ స్టీల్పై కేసీఆర్ పోలిటికల్ గేమ్..!
జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ సిఎం కేసిఆర్…ఏపీపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆల్రెడీ పార్టీ శాఖని కూడా మొదలుపెట్టారు. తోట చంద్రశేఖర్ని అధ్యక్షుడుగా నియమించారు. ఇక ఆయన ఆధ్వర్యంలో ఏపీలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో పోలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, ఇటు జనసేన సైతం..కేంద్రంలోని బిజేపికి […]
జనసేన వర్సెస్ వైసీపీ స్టిక్కర్ల వార్…!
`మా నమ్మకం నువ్వే జగన్` పేరుతో వైసీపీ ప్రభుత్వం వినూన్న కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా.. మరోసారి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇంచార్జులు, గృహసారథులను ప్రజల వద్దకు పంపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తోంది. అదేసమయంలో గత చంద్ర బాబు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. మధ్యలోనే వదిలేసిన కార్యక్రమాలు.. వాటిని తాము ఎలా కొనసా గించామో.. కూడా.. వైసీపీ సర్కారు వివరిస్తోంది. ఈ క్రమంలోనే `మానమ్మకం నువ్వే జగన్` పేరుతో జగన్ […]