కుప్పంలో లక్ష మెజారిటీ..బాబుకు సాధ్యమేనా?

కుప్పంలో ఈ సారి లక్ష మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. కుప్పంని దక్కించుకుంటామని వైసీపీ వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో తాను లక్ష మెజారిటీతో గెలిచేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే అక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో సాధ్యం కాదనే చెప్పాలి. 1989 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వస్తున్న బాబు అత్యధిక మెజారిటీ 66 వేలు అది కూడా 1999 ఎన్నికల్లో వచ్చింది. పలుమార్లు 50 […]

పవన్ రెడీ..జనసేనకు కలిసొస్తుందా?

చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారు. ఎప్పుడో  పార్టీ ఆవిర్భావ సమయంలో కనిపించారు. ఆ తర్వాత వర్షాల వల్ల నష్టపోయిన రైతులని పరామర్శించేందుకు వచ్చారు. ఇంకా అంతే ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలు గాని, పార్టీ కోసం జనంలో తిరగడం చేయలేదు. పూర్తిగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉండిపోయారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు […]

సీమలో లోకేష్ సక్సెస్ అయినట్లేనా..టీడీపీకి 30 ప్లస్ సాధ్యమేనా?

జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టారు. కుప్పం ఎలాగో టి‌డి‌పి కంచుకోట కాబట్టి అక్కడ ప్రజా స్పందన బాగా వచ్చింది. కానీ తర్వాత అనుకున్న విధంగా రాలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో పాదయాత్ర హైలైట్ కాలేదు. ఆ తర్వాత నుంచి సీన్ మారింది. పీలేరు, నగరి, పలమనేరు లాంటి స్థానాల్లో భారీ స్థాయిలో పాదయాత్ర సక్సెస్ అయింది. అలాగే లోకేష్ అన్నీ వర్గాల […]

కమలంలో ఈటల పోటు..సైడ్ చేస్తారా?

ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోరు ఉంది..ఆ పార్టీలో నేతలు బహిరంగంగానే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇటీవల వారు పోరు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా బి‌జే‌పిలో రచ్చ మొదలైంది. ఆ పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. దీని వల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంది. కొన్ని విజయాలతో తెలంగాణలో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. ఒకానొక సమయంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం […]

జగన్‌పై షా అస్త్రం..బాబుని సెట్  చేసినట్లేనా?

కావాలని టార్గెట్ చేశారా? లేదా జగన్‌ని నిజంగానే ఓడించాలని అనుకుంటున్నారో తెలియదు గాని..తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని ఫైర్ అయ్యారు. అంతకముందు బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డా సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గానే విమర్శలు చేశారు. దీంతో జగన్, బి‌జే‌పి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బ్రేక్ అయిందా? బి‌జే‌పి, జగన్ మధ్య గ్యాప్ పెరిగిందా? […]

టీ-బీజేపీలో బిగ్ చేంజ్..ఎన్నికలే టార్గెట్.!

తెలంగాణలో మొన్నటివరకు బి‌జే‌పి దూకుడుగా రాజకీయం చేసింది..కానీ కొంతకాలం నుంచి ఆ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల్లో బి‌జే‌పి ఓడిపోవడం..ఆ ప్రభావం తెలంగాణపై పడింది. వాస్తవానికి 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన దగ్గర నుంచి బి‌జే‌పి దూకుడు మీద ఉంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి లో సత్తా చాటడం..మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడంతో బి‌జే‌పి రేసులో ఉంది. పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే ప్రత్యామ్నాయం అన్నట్లు టార్గెట్ చేసేవారు. దీంతో బి‌ఆర్‌ఎస్, […]

కొడాలికి చిక్కులు..ఇలా టార్గెట్ అయ్యారే.!

ఏపీలో పవర్‌ఫుల్ నాయకుల్లో కొడాలి నాని ఒకరు..ఈయన చంద్రబాబుని తిట్టే తిట్లు గురించి అందరికీ తెలిసిందే. ఇక కొడాలి తిట్టినట్లుగా బాబుని మరొక నేత తిట్టారు. కేవలం బాబుని తిట్టడానికే కొడాలి ఉన్నారా? అన్నట్లు పరిస్తితి ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే..రాజకీయంగా గుడివాడలో నానికి తిరుగులేదు. అక్కడ ఆయన దూకుడు వేరు. ప్రజా మద్ధతు కూడా ఎక్కువే. అయితే ఇంతకాలం ఆ బలంతో విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ ఇటీవల కాస్త సీన్ రివర్స్ అవుతున్నట్లు […]

బాబులో మరో కోణం.. వైసీపీకి కౌంటర్లు.!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాస మారింది..స్పీచ్‌లు మారాయి. మొన్నటివరకు ఆయన స్పీచ్‌లు పెద్ద ఉపన్యాసాలు మాదిరి ఉండేవి..ఏదో కాలేజీల్లో లెక్చర్ ఇస్తున్నట్లు ఉండేది. ఆయన స్పీచ్‌లు వినడానికి తెలుగు తమ్ముళ్లే పెద్ద ఆసక్తి చూపే వారు కాదు. అలా ఉండే బాబు స్పీచ్‌లు ఇప్పుడు మారుతున్నాయి. ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి అంశం ప్రజల్లోకి వెళ్ళేలా మాట్లాడుతున్నారు. తాజాగా టి‌డి‌పి సోషల్ మీడియా కార్యకర్తలతో బాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ […]

తెలుగు మీడియాలో మ‌రోసారి నెంబ‌ర్ వ‌న్ ఛానెల్‌గా Ntv .. బార్క్ రేటింగ్స్‌లో దుమ్ము దులిపేసిందిగా…!

Ntv No.1 Channel: మెరుపు వేగంతో మెరుగైన వార్తలు అందిస్తున్న ఎన్టీవీని తెలుగు రాష్ట్రాల ప్రజలు మరోసారి అగ్రస్థానంలో కూర్చోబెట్టారు. 24×7 నిరంతరం వార్త ప్రసారాలతో ఎప్పటికప్పుడు నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. అవాస్తావాలకు చోటు లేకుండా.. ప్రజానీకానికి నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తూ మరోసారి అందనంత ఎత్తుకు ఎదిగింది. ఛానెల్ ప్రారంభించిన నాటి నుంచే ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందుతూ ఇంతింతై వటుడింతై అన్నట్లు అందనంత ఎత్తు రేటింగ్స్‌ను సొంతం చేసుకుంది. పట్టణం నుంచి మారుమూల గ్రామాల వరకు […]