వర్లగారూ.. మీ మేడం లెటర్లో ఫైర్ ఉందా?

రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నాయకుడు వర్ల రామయ్య.. తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడమే లక్ష్యం అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేశారు. ఆ విమర్శల్లో ఆయన ముందే వెనుకా చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను వెలివేస్తున్నది.. ఆయన వచ్చినా సరే.. ఇక పార్టీలోకి రానివ్వం అనే అర్థం వచ్చేంత స్థాయిలో విమర్శలు చేశారు. ఇంతకూ వర్లకు అంత ఆగ్రహం ఎందుకొచ్చిందంటే.. నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు […]

వర్ల వదరుబోతుతనంపై కమ్మతమ్ముళ్ల ఆగ్రహం!

జూనియర్ ఎన్టీఆర్ గురించి విమర్శలు చేయడానికి వర్ల రామయ్య ఎవడు? ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వినవస్తున్న ప్రశ్న కాదు. సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లనుంచి వినవస్తున్న ప్రశ్న. వర్ల రామయ్య మాటలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య తన వదరుబోతుతనం వలన పార్టీకి చేటు చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కన్నీళ్ల ఎపిసోడ్ దాదాపుగా మరుగున పడిపోతున్న సమయంలో.. దానిని మళ్లీ తెరపైకి తెస్తూ వర్ల రామయ్య రాజకీయం చేయడం […]

మెగాస్టార్ విన్నవించారు.. జగన్ పట్టించుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి విరమించుకున్నాక.. ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతిసారీ.. జగన్ నిర్ణయాలను సమర్థించే డైలాగులు రావడమూ.. అలాగే.. జగన్ తో స్నేహపూర్వక భేటీలు ఇలా ఆయన ప్రస్థానం సాగుతోంది. అయితే తాజా విషయంలో మాత్రం.. చిరంజీవి తన విజ్ఞప్తిని జగన్ ముందు ఉంచారు గానీ.. ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఏపీలో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడంతో పాటు, టికెట్ ధరలను ప్రభుత్వమే […]

చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]

ఆ స్వతంత్రులకు సపోర్ట్ ఇస్తున్నదెవరో?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో అధికార పార్టీకి ఏ ఇబ్బందీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తలనొప్పిగా మారనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నది 12 స్థానాలు. 12 సీట్లకు గాను 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు బరిలోకి దిగారు. అసలు విషయమేమంటే.. 12 సీట్లకు గాను 102 మంది నామినేషన్లు ఫైల్ చేయడంతో […]

కమలం.. ఇక కుల సమీకరణలు..

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఊహించని విజయం.. అసెంబ్లీలో ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో పట్టు పెంచుకునే యత్నం.. అధికారంలోకి కాకపోయినా కనీసం 30..40 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని టీబీజేపీ నాయకులు ప్లాన్ రూపొందిస్తున్నారు. వారికి హై కమాండ్ కూడా ఫుల్ సపోర్టు ఉంది. బండి సంజయ్ దూసుకుపోతున్నాడు. దీంతో పొలిటికల్ లీటర్లు కులసమీకరణలపై ద్రుష్టి సారించారు. ముఖ్యంగా మున్నూరుకాపు, ముదిరాజ్, రెడ్డి, ఎస్టీల ఓట్లు రాబట్టుకునేందుకు, వారి మద్దతు కూడబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. 2023 ఎన్నికలే […]

‘కారు’ తిరిగొచ్చింది..‘బండి’ బయలుదేరుతుంది

వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ఇంకా కొద్దిరోజుల పాటు కొనసాగనుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మీడియాలో నానుతున్నారు. ఎవరూ రైతుకు మేలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు వర్షం వచ్చి వరి ధాన్యం మొలకలెత్తుతోంది..మరోవైపు అన్నదాతలు వరిని కొనేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సమస్యను తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ […]

సర్కారు చేతుల్లో ఇక ‘షో’

అనుకున్నదే అయింది.. కాదు అనుకున్నదే చేశారు.. థియేటర్లలో ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకుల జేబులకు చిల్లులు వేస్తున్నారని ప్రభుత్వం కొద్ది రోజులుగా చెబుతోంది. అందుకే టికెట్ల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని జగన్ భావించారు. చాలా రోజులుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయినా.. గుర్రం ఎగురా వచ్చు అని సినిమా పెద్దలు జగన్ వైపు ఆశగా చూశారు. నో.. చాన్స్ జగన్ అనుకున్నాడంటే ట్రిగ్గర్ నొక్కాల్సిందే. అనుకున్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేశాడు. ఏపీ సినిమాల […]

సారు.. వచ్చేశారు సిటీకి

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో సిటీలో ల్యాండ్ అయ్యారు. వరి సమస్యపై మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రజలకు చెప్పి తన టీమ్ తో హస్తినకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఎవరి దర్శనమూ కాలేదు. ఎంత ప్రయత్నించినా మోదీని కలిసే అవకాశం రాలేదు. దీంతో అక్కడే ఉండి చేసేది లేక తిరిగొచ్చేశారు. విచిత్రమేమంటే నాలుగు రోజుల పాటు ఒక […]