టీడీపీ కండువాతో రాము..సీటు నాదే అంటున్న రావి..!

గుడివాడ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి..అందులోనూ టీడీపీలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు చాలా కసితో ఉన్నాయి. ఆయన్ని ఓడించి తీరాలని పనిచేస్తున్నాయి. బలమైన నాయకుడుని ముందు పెట్టి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే టీడీపీలో సీటు కోసం పోటీ పెరిగిపోతుంది.ఇప్పటికీ గుడివాడలో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతానికి ఇంచార్జ్‌గా  రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో […]

పుష్పశ్రీకి భారీ షాక్..కురుపాం టీడీపీకి దక్కేనా!

ఏజెన్సీ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని విషయం తెలిసిందే. ఏజెన్సీల్లో మొదట కాంగ్రెస్ హవా నడిచేది.ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇక ఏజెన్సీలో కీలకంగా ఉన్న కురుపాం స్థానంలో కూడా గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. ఇక్కడ టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పుష్పశ్రీ వాణి గెలుస్తూ వచ్చారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక గిరిజన శాఖ […]

విజయనగరంలో బాబు సత్తా..టీడీపీకి అవే ప్లస్.!

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే..ప్రతి జిల్లాలోనూ టీడీపీకి దెబ్బతగిలింది. కొన్ని జిల్లాల్లో ఇంకా దారుణమైన ఫలితాలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో దారుణంగా ఓడి ఒక్క సీటు కూడా గెలవలేదు. మామూలుగా సీమ బెల్టులో టీడీపీకి దారుణ ఓటమి వచ్చిన పార్టీ శ్రేణులు తీసుకున్నాయి గాని..పట్టున్న విజయనగరంలో కూడా ఒక్క సీటు కూడా తెచ్చుకోకపోవడం మింగుడు పడని విషయం. […]

అనంతలో చౌదరీకి సీటు కష్టాలు..!

అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అంతా అనుకుంటారు…అయితే ఒకప్పుడు అనంతలో టీడీపీకి కలిసొచ్చింది..కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారింది..అక్కడ వైసీపీ పాగా వేసింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే నిదానంగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం వలన టీడీపీకి కలిసొస్తుందని అనుకోవడానికి లేదు. వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో మాత్రం […]

త‌మ్ముళ్ల మ‌ధ్య గొడ‌వ పెట్టిన చంద్ర‌బాబు… త‌న్నుకుంటున్నారుగా…!

తాంబూలాలిచ్చేశాను.. త‌న్నుకు చావండి! అని క‌న్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నేత‌లు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీల‌క‌మైన డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబం ధించి.. నాయ‌కులు త‌న్నుకులాడుతున్నారు. డోన్ నియోజ‌క‌వ‌ర్గంపై కేఈ కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్రభాకర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని త‌పిస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియ‌మిం చారు. కొన్ని రోజుల కింద‌ట […]

తెలంగాణలో 30 సీట్లపై టీడీపీ ఆశలు..ఛాన్స్ ఉందా?

ఒకప్పుడు తెలంగాణ అంటే టీడీపీకి కంచుకోట అన్నట్లు ఉండేది. అక్కడ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది..కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బాగానే సీట్లు తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ గెలిచింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీని గట్టిగా దెబ్బతీశారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో..టీడీపీ పతన దశకు వచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని..కేవలం 2 […]

బొబ్బిలిలో సైకిల్ జోరు..30 ఏళ్ల తర్వాత ఛాన్స్.!

ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 వరకు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా గెలిచిన సందర్భాలు తక్కువ. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే టీడీపీ అక్కడ గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక ఎప్పుడో 1994లో గెలిచిన టీడీపీకి మళ్ళీ 2024 […]

బాలయ్యతో పవన్..అసలు గేమ్ మొదలైందా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళుతున్నాయి. పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు గాని..చంద్రబాబు-పవన్ మాత్రం పరోక్షంగా పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఈ పొత్తు అంశాన్ని ఎన్నికల ముందే తేలుస్తారని తెలుస్తోంది. అంటే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే బాబు వెళ్ళి పవన్‌ని […]

టీపీసీసీ మార్పు..రేవంత్‌కు ఎసరు..దిగ్విజయ్ తేల్చేశారు.!

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి…కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలపై ఫైట్ చేయడం, విమర్శలు చేయడం చేస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం మారిపోయింది. పైగా ఇటీవల పి‌సి‌సి పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ నడిచింది. సీనియర్లని పట్టించుకోకుండా పదవులని భర్తీ చేశారని, టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఎక్కువ ఇచ్చారని, […]