ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని సర్వేలు ఆశ్చర్యకంగానూ, మరికొన్ని షాకింగ్గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్కు పార్టీలకు ఒక తీపి, ఒక చేదు వార్తను అందించాయి. ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్.. అత్యంత పాపులర్ నాయకుడు. వారి తర్వాత ఎవరు అంటే? కేటీఆర్, హరీశ్రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ సర్వే ప్రకారం కేసీఆర్ తర్వాత.. అంతటి […]
Category: Latest News
టీటీడీ ఈవో నియామకంపై రచ్చ తగునా?
`టీటీడీ ఈవోగా ఉత్తరాదివారిని ఎందుకు నియమించారు? అందుకు తగిన సమర్థులు ఏపీలో లేరా?` అంటూ ట్విటర్లో ఘాటుగా స్పందించారు జనసేనాని పవన్ కల్యాణ్!! `తెలుగు రాని వ్యక్తిని ఆ పదవికి ఎందుకు కట్టబెట్టారు` అంటూ శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామి ప్రశ్న!! ఒక వ్యక్తి నియామకంపై ఇప్పుడు ఏపీలో సరికొత్త చర్చ మొద లైంది. రాజకీయ నాయకుడు ఒకరు.. ఆధ్యాత్మక వేత్త మరొకరు ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా ఫోకస్ చేస్తున్నారు? దీని వల్ల వారికి […]
నంద్యాల అభ్యర్థి ఎంపికపై బాబు వ్యూహం ఇదే..
పథకాల గురించి సర్వే.. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే.. పార్టీ పరిస్థితిపై సర్వే.. ఇలా ప్రతి రెండు మూడు నెలలకోసారి సర్వేలు నిర్వహించి వాటి ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడం ఏపీ సీఎం చంద్రబాబుకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. క్లిష్టపరిస్థితుల్లో, ఎన్నికల సమయాల్లోనూ ఆయన ఈ విధానాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఆయన దీనినే ఫాలో అవుతున్నారట. కొంత కాలం నుంచీ టీడీపీతో అంటీముట్టనట్టు ఉంటున్న శిల్పావర్గానికి చెందిన […]
వైసీపీ నుంచి టిక్కెట్టు గ్యారెంటీ ” కానీ ” జనసేన వస్తే గెలుపు కష్టమే బాసు..!
కృష్ణా జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దుగా ఉండే నియోజకవర్గం నూజివీడు. గతంలో నూజివీడు జమిందారులు ఈ ప్రాంతాన్ని ఎన్నో శతాబ్దాల పాటు పాలించడంతో ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. నూజివీడును పాలించిన మేకా వంశానికి చెందిన ప్రతాప్ అప్పారావు ఫ్యామిలీకి నియోజకవర్గంలో బలమైన నేపథ్యం ఉంది. 1999లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 40 వేల ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన ప్రతాప్, 2004లో కాంగ్రెస్ తరపున భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009లో […]
దారుణంగా పడిపోయిన మోదుగుల గ్రాఫ్
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో టీడీపీ తరపున నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో గెలిచి లక్గా ఎంపీ అయిన మోదుగుల గత ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు కోసం తన సిట్టింగ్ సీటును వదులుకుని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి అవుతానని మూడేళ్లుగా కలలు కంటోన్న మోదుగులకు ప్రక్షాళనలో చంద్రబాబు షాక్ ఇచ్చారు. దీంతో మోదుగుల బాబు అన్నా, టీడీపీ అధిష్టానం అన్నా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ […]
పాలిటిక్స్లోకి శివగామి..! ఏ పార్టీ..!
సినీనటులకు రాజకీయాలపై నానాటికీ ఆసక్తి అధికమవుతోంది. ముఖ్యంగా సినీ తెరపై గ్లామర్ ఒలకబోసి.. టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నగ్మా. ఖుష్బూ వంటి వాళ్లంతా రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటే.. వారిని చూసి `శివగామి`కి కూడా రాజకీయాలంటే ముచ్చట కలిగినట్టుంది. అందుకే రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు నటి రమ్యకృష్ణ! ఏ పార్టీలో చేరతారనేది ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆమె కాషాయ జెండా కప్పుకోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. […]
చంద్రబాబుపై పవన్ ప్రశ్నల వర్షం
దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని విరుచుకుపడుతుంటారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్!! దక్షిణ భారతదేశాన్ని, నాయకులను నిర్లక్ష్యం వహిస్తోందని వీలు దొరికినప్పుడల్లా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశంపై పెట్టారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఒక ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రశ్నల బాణాలు సంధించారు. ఘాటైన పదజాలంతో నిలదీశారు. టీడీపీపై మాట కూడా పడనీయకుండా చేస్తూ.. కష్టకాలంలో అండగా నిలుస్తున్న పవన్.. ఒక్కసారిగా ఇలా చంద్రబాబు ప్రభుత్వాన్ని […]
టీడీపీకి మరో ఎంపీ రాజీనామా?
2019 ఎన్నికల సమయానికి ప్రస్తుత టీడీపీ ఎంపీల్లో చాలామంది రాజీనామాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని, ఇందుకోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని రాయపాటి సాంబశివరావు ప్రకటించేశారు. అయితే ఇదే పదవి కోసం పోటీపడుతున్న ఎంపీ మురళీమోహన్ కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం! ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా తిరగలేకపోతున్నారు. తన వారసురాలిగా కోడలు రూపాదేవిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో టీటీడీ […]
లాలు కేసులో సంచలనం నమోదు?
అక్రమార్కుల కేసులో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి శశికళకు జైలు శిక్ష విధించిన అనంతరం.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శశికళ తర్వాత ఎవరు అనే దానిపై అనేక పేర్లు వినిపించినా.. ఇప్పుడు బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అని స్పష్టమవుతోంది. పశుగ్రాసం కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుండటంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. అక్రమార్కులపై కేంద్రం సీరియస్గా దృష్టిపెట్టడంతో పాటు.. సుప్రీం సంచలన నిర్ణయాలు […]