మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… సోషల్‌ మీడియాలో వైరల్‌…!

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… అంటూ కన్యాశుల్యంలో నాటకంలో గిరీశం చెప్పిన డైలాగు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిజమే… ఏపీలో అధికారంలోకి వస్తే చాలు అనుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా లేఖ ఇచ్చారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, […]

నార్కో అధికారులకు నవదీప్‌ ఏం చెప్పాడు…?

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ను నార్కోటిక్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఉన్న లింక్‌లను అధికారులు ఆరా తీశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామన్నారని నవదీప్ విచారణ అనంతరం వెల్లడించారు. ఈ విచారణలో నవదీప్ కి పలు ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్ విభాగం ఎస్పీ సునీత రెడ్డి, ఏసీపీ నరసింగ రావుతో […]

తెలంగాణలో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలో అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. తొలివిడతలో 50 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. అటు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై.. స్క్రీనింగ్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కచ్చితంగా గెలిచే వారికే కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇవ్వనుంది. అటు.. టికెట్లు […]

అసలు ఆ ఇద్దరు ఏమయ్యారు… ఎక్కడున్నారు….?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పరిస్థితులు గరంగరంగా మారాయి. నేతల యాత్రలతో బిజీ బిజీగా ఉన్న తరుణంలో… స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… విజయవాడ ఏసీబీ కోర్టులో […]

టీడీపీ – జనసేన పొత్తు… బీజేపీ కలుస్తుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చంద్రబాబు నాయుడుతో జరిగిన ములాఖత్‌లో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బీజేపీతో కలిసే ఉన్నానని… తమకో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయితే ఈ ప్రకటన చేసి పది రోజులవుతున్నా… ఇప్పటి వరకు మరో అప్‌డేట్ […]

టీడీపీని నడిపించే నేతలే లేరా…..!?

తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంకా చెప్పాలంటే పార్టీని ముందుండి నడిపించే నేత కరువయ్యాడా అనే మాట ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిదంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ […]

జగన్ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా….!

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును దగ్గరగా పరిశీలించిన వారికే తెలుస్తుందంటారు. ఆయన మాట చెబితే చేసి తీరుతాడనేది ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. నవరత్నాల పేరుతో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్… ఎన్నికైన తొలి ఏడాదిలోనే 98 శాతం హామీలు అమలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనను నమ్మిన వారికి పెద్ద పీట వేసిన జగన్… తనను ఎదిరించిన వారికి కూడా అదే స్థాయిలో […]

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..? త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…?

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ త్వరలో కేంద్ర పాలిత కేంద్రం కానుందా..? హైదరాబాద్‌ను యూటీ (యూనియన్ టెరిటరీ) గా చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందా..? హైదారబాద్ యూటీకి సంబంధించి త్వరలో కీలక ప్రకటన రానుందా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృతమైన ప్రచారం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్‌ను యూటీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. దీనికి […]

లోకేశ్ ఢిల్లీలోనే ఎందుకున్నట్లు… వస్తే ఏమవుతుంది….!?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎక్కడున్నారు…. ఆయన కూడా అరెస్ట్ అవుతారా… లోకేశ్ పారిపోయారా… ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న మాట ఇదే. ఓ వైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ అవినీతి జరిగిదంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రెండు రోజుల పాటు సుధీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయనను రాజమండ్రి […]