ఆ మంత్రికి పవన్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారా….!

బ్రో… సాయి ధరమ్ తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించారు. పేరుకు హీరో సాయి ధరమ్ తేజ్ అయినప్పటికీ… సినిమా మొత్తం పవన్ కల్యాణ్ వల్లే ముందుకు సాగింది. సినిమా మొదలైన సరిగ్గా పావుగంటకు స్క్రీన్ పైకి వచ్చిన పవన్… సినిమా చివరి వరకు కనిపించారు. బ్రో సినిమాలో పవన్ సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి, గుడుంబా శంకర్, జల్సా సినిమాల్లోని పాటలు పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ […]

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏమిటీ..?

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదా?… సర్వే రిపోర్టులు ఆ పార్టీ అధినేత కేసిఆర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయా?… అందుకే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారా?…. అందులో వెనుకబడ్డ నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారా?…. రిజర్వుడ్ నియోజకవర్గాలపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీలన్నీ దూకుడు పెంచాయి. దాంతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మరోసారి అధికార పీఠం ఎక్కాలనే పట్టుదలతో ఉన్న […]

ఎంపీకి ఈ సారి టికెట్‌ ఉందా… లేదా…?

రాజమండ్రి సిటీ టికెట్ ఎవరికో అంటూ ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతుందా…? రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న ఎంపీ మార్గాని భరత్‌… ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భయపడుతున్నారా….?…. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత ఎంపీ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనపై ఎంపీ వ్యతిరేక వర్గం ఏమంటోంది…? రాజమండ్రి ఎంపీ కార్యాలయ ప్రకటనపై వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక ఎంపీ మార్గాని భరత్… 2019 […]

అప్పులు కోసం ఏపీ సర్కారు పరుగులు… నిజమేనా…?

ఏపీ ప్రభుత్వం అందితే అప్పులు తీసుకొస్తోంది…. నెలచివరకు వచ్చేసరికి అప్పుల కోసం వెంపర్లాడుతోంది… నిధులను మళ్లించి వేరు అవసరాలకు వాడుతోందని… ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలాసీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన రూ.30,500 కోట్ల రుణ పరిమితి పూర్తి కావడంతో ఏపీకి మళ్లీ అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి నేటి వరకూ ఫలించలేదు. దీంతో, వచ్చే […]

జమిలి ఎన్నికలు… తేల్చేసిన కేంద్రం…!

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మొదటి నుంచి చేస్తున్న ప్రతిపాదన. రాష్ట్రంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేది ప్రధానంగా చెబుతున్నారు. రాష్ట్రాల్లో విడిగా ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు… వాటి ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందనేది మోదీ సర్కార్ మాట. అందుకే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మాట. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం […]

జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ… కారణం…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైధీగా ఉన్నారు. ఇక అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి […]

టార్గెట్ జగన్ సర్కార్… పవన్ కొత్త వార్ స్టార్ట్…!

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన పవన్… ఆ దిశగానే క్రమంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు సార్లు వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్… మూడోసారి కూడా పర్యటించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక అదే సమయంలో జగన్ సర్కార్‌ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉన్న […]

ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు… తప్పెవరిదీ…!?

ఓటర్ల జాబితా పరిశీలనలో చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయ్. బూత్ లెవల్ అధికారులు చేసిన పొరపాట్లు ఒకటొకటిగా వెల్లడవుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జీరో డోర్ నెంబర్ పై అత్యధికంగా ఇళ్లు ఉన్నాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల పై అక్కడ అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సక్రమంగా జాబితాను తయారు చేయలేదని, ఒకే డోర్ […]

ఏపీలో మహిళలకు రక్షణ కరువైందా..?… కేంద్రం నివేదికలో నిజమెంత..?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరువైందా..? మహిళల ప్రాణాలకు ఆంధ్ర రాష్ట్రంలో విలువ లేదా..? ఏపీలో పౌరుల వ్యక్తిగత డేటా చోరీకి గురవుతోందని.. మహిళలు, బాలికల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణమన్న జనసేనాని వ్యాఖ్యలు నిజమవుతున్నాయా..? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్లమెంట్‌ సాక్షిగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైంది. అమ్మలు, అక్కచెల్లెమ్మలు అని మాట్లాడే జగన్‌రెడ్డి పాలనలో.. మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఇవి మేము […]