బొత్స లాస్ట్‌..చీపురుపల్లిలో డ్యామేజ్ లేదులే..!

ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పి‌సి‌సి అధ్యక్షుడుగా పనిచేసి..దాదాపు సీఎం పీఠం వరకు వెళ్ళిన బొత్స..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరీకి డిపాజిట్లు దక్కలేదు. కానీ చీపురుపల్లిలో పోటీ చేసి బొత్స రెండోస్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో అదే చీపురుపల్లి నుంచి సత్తా […]

టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం..పోటీకి తారకరత్న..సీటు ఏది.?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని చెప్పి నందమూరి తారకరత్న తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న తారకరత్న..తాజాగా ఎన్టీఆర్ ప్రచారం చేసే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో జూనియర్ టీడీపీ కోసం ప్రచారం చేస్తారని చెప్పారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్..ఆ తర్వాత టీడీపీ వైపు చూడలేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ […]

సత్తెనపల్లిలో మారిన లెక్క..అంబటికి పవన్ చెక్..!

వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్.. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేసినా, బీజేపీతో పొత్తు వల్ల పవన్..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు..కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని గద్దె దించడం కుదురుతుంది. అయితే ఆ దిశగానే పవన్ ఇప్పుడు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన వల్ల ఓట్లు చీలిపోవడం వల్లే వైసీపీ గెలిచిందని పవన్..తాజాగా సత్తెనపల్లి కౌలు రైతుల సభలో […]

కాంగ్రెస్‌లో కల్లోలం..రేవంత్‌ని సైడ్ చేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతుంది..ఆ పార్టీని సొంత పార్టీ నేతలే ముంచుతున్నారు. ఎప్పటినుంచి కాంగ్రెస్ లో నేతల మధ్య కలహాలు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర రచ్చ జరుగుతుంది. కాంగ్రెస్ లో చాలామంది సీనియర్లు ఉండగా, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పి‌సి‌సి ఇవ్వడం ఏంటని..కాంగ్రెస్ లో చాలామంది నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తూ వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఏ స్థాయిలో […]

వ్యతిరేక ఓటుపైనే పవన్..బీజేపీ సర్దుకుంటుందా?

మళ్ళీ అదే మాట..వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరతామని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు. తాజాగా చనిపోయిన కౌలు రైతులకు సత్తెనపల్లి వేదికగా ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అటు అంబటి రాంబాబుని సైతం టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తామని పవన్ చెప్పుకొచ్చారు.  వైపీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. దీనికే కట్టుబడి ఉన్నానని, వైసీపీ […]

పులివెందుల కూడా లాస్ట్..ఎంపీదే బాధ్యత.!

గడపగడపకు సంబంధించి తాజాగా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు…ఇంచార్జ్‌లు, సమన్వయకర్తలతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు వెళ్ళడంలో విఫలమయ్యారని…తక్కువ రోజులే గడపగడపకు తిరిగారని చెప్పి క్లాస్ ఇచ్చారు. సెప్టెంబర్ 28 సమావేశం తర్వాత ఇప్పటివరకు 78 రోజులు అయింది..అయితే ఇందులో 10-22 రోజులు అంటే చాలా తక్కువ రోజులు తిరిగిన వారు 38 మంది వరకు ఉన్నారు. ఇందులో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ, […]

జగనన్న ఆర్మీతో 175 పక్కా..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే..175 సీట్లు గెలవాల్సిందే అని జగన్ చెబుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లని గడపగడపకు తిప్పుతున్నారు. తాము ప్రజలకు మంచి పనులు చేస్తున్నామని, కాబట్టి ప్రజలు కూడా తమకు అండగా ఉంటారని అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు, వాలంటీర్లనే నమ్ముకోకుండా జగన్..కొత్తగా 50 ఇళ్లకు ముగ్గురు వైసీపీ కార్యకర్తలని గృహ సారథులగా నియమిస్తున్నారు. వీరి పని […]

కృష్ణాలో వెనుకబడిన వైసీపీ..బడా నేతలే.!

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో తాజాగా జగన్..వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాపులో గడపగడపకు పెద్దగా వెళ్లని ఎమ్మెల్యేలపై జగన్ కాస్త సీరియస్ అయినట్లు తెలిసింది. అందరూ ఖచ్చితంగా గడపగడపకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంలో బాగా వెనుకపడ్డారని జగన్ తేల్చి చెప్పేశారు. కృష్ణాలో 16 సీట్లు ఉంటే కేవలం ఒక సీటులోనే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు..మిగిలిన 15 సీట్లలో […]

సిట్టింగులకు సీట్లు..ఎమ్మెల్యేలపై జగన్ సడన్ ప్రేమ..!

పనితీరు సరిగ్గా లేకపోతే ఎట్టి పరిస్తితుల్లోనూ నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి తనని ఏం అనుకోవద్దు అని చెప్పి ఇదివరకు జరిగిన వర్క్ షాపుల్లో జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా వార్నింగ్ ఇచ్చిన జగన్..తాజా వర్క్ షాపులో పూర్తిగా రివర్స్ లో మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే తనకు కోపం లేదని, అత్యంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలెవరినీ పోగొట్టుకోవడం ఇష్టం లేదని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ మళ్లీ చట్టసభలో చూడాలన్నదే తన అభిమతమని, […]