బీసీ-ఎస్సీ-ఎస్టీ..లోకేష్ గురి గట్టిగానే ఉంది.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పికి గెలుపు అనేది చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సారి గెలవకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక బాబుకు తోడుగా ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..పార్టీ బలోపేతం కోసం లోకేష్ సైతం పాటుపడుతున్నారు. […]

విశాఖ వైసీపీలో ట్విస్ట్‌లు..సీటుతో అధ్యక్షుడు.!

ఎప్పుడైతే విశాఖని పరిపాలన రాజధాని అని చెప్పారో..అప్పటినుంచే విశాఖలో రాజకీయంగా వైసీపీకి కలిసిరావడం లేదు. రాజధాని పేరుతో అక్కడ వైసీపీ అన్నీ అక్రమాలకే పాల్పడుతుందనే విమర్శలు వచ్చాయి. ఇక అక్కడి ప్రజలు వైసీపీపై ఆగ్రహంగానే ఉన్నారు. జగన్ విశాఖలో కాపురం పెడతానని అంటున్న అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో టి‌డి‌పి బలపడటం..జనసేనతో పొత్తు ఇంకా ప్లస్ అవ్వడంతో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. […]

ఉచిత విద్యుత్‌ని కవర్ చేసిన కారు..కాంగ్రెస్ సక్సెస్.!

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పోరు నడుస్తుంది. ముఖ్యంగా కే‌టి‌ఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు యుద్ధం నడుస్తుంది. అయితే అమెరికాలో ఉండగా రేవంత్..3 ఎకరాలు నీరు పెట్టడానికి 3 గంటలు సరిపోతుందని, సరాసరినా రోజుకు 8 గంటల చాలు అని అన్నారు. 24 గంటల కరెంట్ వద్దని చెప్పలేదు. కానీ అదిగో […]

ఎన్డీయేలో మీటింగ్‌కి పవన్..బాబు కోసమేనా?

మొత్తానికి రాష్ట్ర రాజకీయాలే కాదు..దేశ రాజకీయాలు కూడా పోటాపోటిగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా రాజకీయం నడిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా కేంద్రంలో గద్దెనెక్కాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని బి‌జే‌పి..మిత్రపక్షాలు ట్రై చేస్తున్నాయి. ఇదే క్రమంలో తమ బలాన్ని పెంచుకునేలా ప్రధాన పార్టీలు రాజకీయం నడిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు పాట్నాలో ఐక్య సమావేశం […]

మైలవరంలో ఉమాకు పట్టు దొరకడం లేదా?

టీడీపీలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఇప్పుడు రాజకీయంగా ఏది కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు కృష్ణా జిల్లా టి‌డి‌పి అంటే ఈయన పేరే గుర్తొచ్చేది. పెత్తనం మొత్తం ఈయన చేతుల్లోనే ఉండేది. ఇక ఈయన పెత్తనం వల్లే జిల్లాలో టి‌డి‌పి దెబ్బతిందని టాక్ ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు పార్టీని వీడి వెళ్లిపోయారని అంటారు. సరే గతంలో ఏం జరిగిందో గాని..ఇప్పుడు రాజకీయంగా ఉమాకు […]

పిఠాపురం-రాజానగరం జనసేనకే ఫిక్స్ చేసుకుంటారా?  

జనసేన అధినేత పవన్ దూకుడు కనబరుస్తున్నారు. ఇంతకాలం కాస్త ఆచి తూచి అడుగులేస్తూ..ఎక్కువ శాతం సినిమా షూటింగుల్లో బిజీగా గడిపిన ఆయన..ఇప్పుడు జనసేనపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతూ..జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే జనసేనలోకి వలసలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుని జనసేనలోకి చేర్చుకున్నారు. అటు తాజాగా విశాఖలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం..పవన్‌ని కలిశారు. ఈయన […]

కేటీఆర్ వర్సెస్ రేవంత్..ప్రజలు ఎటువైపు.!

తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తూనే ఉంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత  అని చెప్పి కనీసం 12 గంటల కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటుంది. ఈ మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్లుకు వెళ్ళి..24 గంటలు రావడం లేదని రుజువు చేశారు. ఇదే క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి..3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు అని, మొత్తం మీద 8 గంటలు […]

జనసేనలోకి పంచకర్ల..టీడీపీ సీటుపై కన్ను.!

వైసీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు వల్ల కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సీటు విషయంలో చాలా చోట్ల రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీటు గ్యారెంటీ లేదనుకునే నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడారు. వాస్తవానికి ఈయన ఇప్పటికే రెండు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. ఇక జనసేనలో చేరి సీటు దక్కించుకుని గెలవాలని చూస్తున్నారు. అయితే టి‌డి‌పితో పొత్తు […]

సిక్కోలు ఫ్యాన్‌ పోరు..సైకిల్‌కి ప్లస్ చేస్తారా?

ఏపీలో ఎక్కడకక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. మరికొందరు ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు రచ్చ లేపుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలే అక్కడ టి‌డి‌పి బలపడుతున్న వేళ..వైసీపీలో పోరు నడవటం టి‌డి‌పికి ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటికే అన్నదమ్ములైన ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని […]