సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయన్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. సక్సెస్ అందుకుంది. 4 నదుల వయస్సులోనూ.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. హీరోలకు మించిన స్టార్డమ్ అమ్మడి సొంతం. ఇక.. ఇటీవల జవాన్ తో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చి.. బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ క్రమంలోనే.. రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది.

ఇక.. ప్రస్తుతం నయన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే.. గతంలో నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్టార్ హీరోతో నటించి తప్పు చేశానంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. తెలుగు, తమిళ భాషలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాలకంటే ఎక్కువ పర్సనల్ విషయాలతోనే హైలెట్ గా మారింది.

2005లో ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన గజినీ మూవీలో సూర్య హీరోగా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అసలు హీరోయిన్గా అసిన్ నటించగా.. సెకండ్ హీరోయిన్ గా నయన్ మెరిసింది. అయితే.. ఈ సినిమాలో తనను నెగిటివ్ షేడ్స్తో తో చూపించారని.. హీరోయిన్ పాత్రకు దగ్గరగా ఉంటుందని చెప్పి.. అలా కాకుండా నెగటివ్గా చూపించడం నన్ను ఎంతగానో భాదించిందని.. ఆ సినిమా చేసి.. నా కెరీర్ లోనే బిగ్ మిస్టేక్ చేసానని నయనతార గతంలో వివరించింది. ప్రస్తుతం మరోసారి నయన్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

