టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీలా తనదైన నటన, అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సెన్సేషనల్ బ్యూటీగా.. భారీ క్రేజ్ను సంపాదించుకుంది. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినంత త్వరగా.. ఫ్లాప్లు కూడా రావడంతో అమ్మడు కాస్త వెనుకబడింది. ఈ క్రమంలో శ్రీ లీల బాలీవుడ్ పై కన్నేసిందంటూ వార్తలు వినిపించాయి. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్తో కలిసి ఓ రొమాంటిక్ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించే అవకాశాన్ని అందుకుందని.. గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
వరుణ్ ధావన్ బాలీవుడ్ టాలెంటెడ్ హీరోగా భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. అలాంటి హీరో సరసన బాలీవుడ్ ఎంట్రీ అంటే అది నిజంగా అదృష్టమని చెప్పాలి. ఇక మన టాలీవుడ్ నుండి బాలీవుడ్లో అడుగుపెట్టిన కీర్తి సురేష్, సమంతలు కూడా మొదట వరుణ్ ధావన్ సరసన నటించే అవకాశాలు దక్కించుకుని.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో శ్రీ లీల లైన్ క్లియర్ అయితే నిజంగా ఈ కాంబో బాగా వర్క్ అవుట్ అవుతుంది. అయితే ఇంతలోనే అమ్మడికి బాలీవుడ్ నేపటిజం అడ్డుపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీలకు.. నటవరసురాలు అనన్య పాండే నుంచి గట్టి పోటీ ఎదురవుతుందట. సెకండ్ లీడ్ అయినా కానీ ధావన్ బోయ్ సరసన నటించే అవకాశం కోసం అనన్య పాండే తెగ ప్రయత్నిస్తుందని టాక్.
అయితే టాలీవుడ్ లో స్టార్గా క్రేజ్ సంపాదించుకున్నా.. బాలీవుడ్ లో అమ్మడికి సంభంధాలు లేకపోవడంతో ఆమెకు మైనస్ అయింద..ని అదే టైంలో అనన్యకు ఇండస్ట్రీలో ఉన్న సంబంధాలు కలిసి రానున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి డైరెక్టర్ డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్లతో ముచ్చటించిందని.. దీంతో శ్రీ లీలకు దక్కాల్సిన ఛాన్స్ను అనన్య పాండేకు ఇచ్చారంటూ సమాచారం. కాగా గతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ అమ్మడు.. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈమె బాలీవుడ్ లో మంచి పేరున్న సీనియర్ నటుడు ఛుంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక కీర్తి సురేష్, సమంతలకు ఛాన్స్ ఇచ్చిన వరుణ్ దావన్ నెక్స్ట్ మూవీలో శ్రీలీలకు అవకాశం ఇస్తాడా.. లేదా.. తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.