ఖర్జూర పండ్లు ఇవి మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్లో ఒకటి. ఖర్జూర పండ్లు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. అన్ని రకాల తీపి వంటకాల తయారీలో కూడా పంచదారకు బదులుగా వీటిని వాడతారు. ఖర్జూర పండ్లను, ఖర్జూర పండ్లతో చేసిన స్వీట్లు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఖర్జూర పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పోషకాహార నిపుణులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాలంటూ చెబుతున్నారు. ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఒకసారి చూద్దాం.
ఖర్జూర పండ్లలో పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ కె లాంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రేగుల కదలికలు మెరుగుపరిచి.. మల బద్దక సమస్యకు చెక్ పెడుతుంది. అలాగే తీపి వంటకాలు తయారీలోనూ పంచదార బదులు ఖర్జూరాలను వాడడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఖర్జూర పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్లేవనాయుడులు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్యంగా ఉండడానికి సాయపడతాయి. ఇది శరీరంలో ఉంటే ప్రి రాడికల్స్ ను నశింపజేసి శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
ఎముకలు గుల్ల భారడం, ఆస్ట్రియోఫెరాసిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుండె ఆరోగ్య సమస్యలకు, రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఐరన్ లోపం ఉన్నవారికి, రక్తహీనత సమస్యతో బాధపడే వారికి.. ఇలాంటి అన్ని సమస్యలకు ఖర్జూర పండు తినడంతో ఉపశమనం లభిస్తుంది. నీరసం, బలహీనత లాంటి సమస్యలు దరి చేరవు. బరువు తగ్గడానికి కూడా ఖర్జూరం సాయపడుతుందన్న విషయం చాలామందికి తెలియదు. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. చిరుతళకు బదులు ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల పై చెప్పిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. కనుక రోజుకు 2 నుంచి 3 ఖర్జూర పండ్లను తీనటం ఇప్పటినుంచే మీతో పాటు పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిది.