” సుహాసిని తో నాది అలాంటి బంధం “… గుట్టు రట్టు చేసిన బాలయ్య..‌.!

నందమూరి నటసింహం బాలయ్య, నటి సుహాసిని మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు సైతం అయ్యాయి. అంతేకాకుండా సుహాసిని.. బాలయ్య నటించిన పాండురంగడు, లెజెండ్ వంటి సినిమాలలో కీలక పాత్రలో సైతం పోషించింది. అయితే తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ” అన్ స్టాపబుల్ ” షో కి గెస్టులుగా వచ్చారు సీనియర్ నటి సుహాసిని, శ్రియా, డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి పరాంజీలు.

ఇక వీళ్ళందరికీ కన్న ముందు గా సీనియర్ నటి సుహాసిని స్టేజ్ మీదకి రాగా.. నాకు సుహాసిని కి మధ్య విడదీయలేని బంధం ఉంది అంటూ బాలయ్య ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇక అలాగే శ్రియా తో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రమంలోనే సుహాసిని.. బాలయ్య గురించి మాట్లాడుతూ.. ” బాలయ్య అప్పట్లో చాలా సిగ్గు పడుతూ ఉండేవారు ” అని చెప్పగా శ్రియా గట్టిగా అరిసింది.

ఇక వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పేది నేను అసలు నమ్మను అని చెప్పగా బాలయ్య మాట్లాడుతూ ‌‌…” నేను మీ ముగ్గురితో మాత్రమే మాట్లాడుతాను. హరీష్ శంకర్ ని పక్కన పెడతాను ” అని సెటైర్ వేశాడు బాలయ్య. ఇక దీంతో జయంతి సి పరాంజి మాట్లాడుతూ… ఏ పాపం ఆయనతో ఎందుకు మాట్లాడరు అని అడిగారు. ఇక దీనికి రిప్లై ఇస్తూ..” నాకు హరీష్ తో పాత గొడవలు ఉన్నాయిలే ” అని అన్నాడు బాలయ్య. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్య, సుహాసిని మధ్య ఉన్న బంధం గురించి తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.