సింగర్ గీతామాధురి.. టాలీవుడ్ నటుడు నందు కొంతకాలంగా ప్రేమించుకుని అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఇటీవల నెట్టింట ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట స్పందించి అందులో ఎటువంటి నిజం లేదంటూ ఖండించారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు… గీతా మాధురి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈయన మాట్లాడుతూ…” నేను గీత ఓసారి లండన్ కు వెళ్ళాం. అక్కడ క్యాసినో గేమ్ చూసి ఆమె దాన్ని ఇష్టపడింది. అప్పటికప్పుడు నేర్చుకుంది కూడా. తను తెలివైన అమ్మాయే కానీ అక్కడ క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఈ సారి వస్తుందేమో చూద్దామంటూ న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఆడింది. అలా మూడు నాలుగు సార్లు ఓడిపోయి డబ్బులు పోగొట్టింది. ఇక ఇలా ఓ చోట సమయం తెలియకుండా ఆడుతూనే ఉంది.
నాకు విసుగు వచ్చి డబ్బులు విసిరేసి నేను వెళ్ళిపోతున్నట్లు బయటకు వచ్చేసాను. తను కూడా క్షమించమని అడిగి గీత బయటకు వచ్చేసింది. క్యాసినో బయట నేను తనను తిడుతుంటే.. అమ్మాయిని వేధిస్తున్నానని అనుకుని పోలీసులు వచ్చారు. మేమిద్దరం భార్యాభర్తలమే అని వారికి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఆ తర్వాత ఈ గేమ్ ఆడటం తగ్గించేసింది. ఒకవేళ ఆడిన…రూ.5- 10 వేలు మాత్రమే పెడుతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు నందు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.