బన్నీకి కత్తిలాంటి ఫిగర్ ని సెట్ చేసిన త్రివిక్రమ్.. ఇక రచ్చ షురూ..

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో ఓ సినిమా తరగక్కనుంది. అయితే ఈ సినిమాకి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఓ క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్ సెట్ చేశాడు.

ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్గా చూజ్‌ చేసుకున్నాడట మాటలు మాంత్రికుడు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇప్పటికి నాగచైతన్య – చందు మండేటి కాంబో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి తన రెండో తెలుగు ప్రాజెక్టును కూడా ఫైనలైజ్ చేసింది.

మొత్తానికి బన్నీ- సాయి పల్లవి తెరపై కనిపిస్తే చూడాలని ఎప్పటినుంచో ఫాన్స్ వెయిట్ చేశారు. అలాంటి ఈ కాంబోని త్రివిక్రమ్ ఎట్టకేలకు సెట్ చేశాడు. ఇక వీరి కాంబోలో వచ్చే సినిమా రచ్చరంబోలానే అంటూ అందరూ భావిస్తున్నారు. వీళ్ళిద్దరూ డాన్స్ ఎంత బాగా ఇరగదీస్తారో అందరికీ తెలుసు. ఇప్పటివరకు బన్నీ, సాయి పల్లవి క‌లిసి తెరపై కనిపించలేదు. ఒకవేళ వీళ్ళు కలిసి నటిస్తే అది అభిమానులకు నిజంగా జాత‌ర‌లా ఉంటుంది.